యాప్నగరం

అసెంబ్లీలోకి గ్రెనేడ్ తెచ్చిన ఎమ్మెల్యే

అసెంబ్లీలో అడుగు పెట్టిన వెంటనే నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన ఆయన గ్రెనేడ్ చూపిస్తూ మాట్లాడడం ప్రారంభించారు.గడువు తీరిన ఈ గ్రెనేడ్‌ను కొన్ని రోజుల కిందటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ప్రయోగించారని స్పీకర్‌కు చూపించారు.

BCCL 7 Mar 2018, 6:39 pm
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన చట్టసభల్లో అరుపులు, కేకలు అప్పుడప్పుడు బాహాబాహి సర్వసాధారణం అయిపోయాయి. అయితే దేశ చరిత్రలో మరో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ ఎమ్మెల్యే ఏకంగా గ్రెనేడ్ అసెంబ్లీకి తీసుకొచ్చి కలకలం రేపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళ మాజీ హోంశాఖ మంత్రి, తిరువంచూర్ ఎమ్మెల్యే రాధాకృష్ణన్ బుధవారం ఉదయం కేరళ అసెంబ్లీకి గ్రెనేడ్ తీసుకొచ్చి హడావిడి చేశారు.
Samayam Telugu congress mla enters kerala assembly with grenade shell sparks debate
అసెంబ్లీలోకి గ్రెనేడ్ తెచ్చిన ఎమ్మెల్యే


అసెంబ్లీలో అడుగు పెట్టిన వెంటనే నేరుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లిన ఆయన గ్రెనేడ్ చూపిస్తూ మాట్లాడడం ప్రారంభించారు. గడువు తీరిన ఈ గ్రెనేడ్‌ను కొన్ని రోజుల కిందటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ప్రయోగించారని స్పీకర్‌కు చూపించారు. అయితే మిగతా ఎమ్మెల్యేలు అంతా అది నిజమైన గ్రెనేడ్ అనుకొని కాసేపు కంగారు పడ్డారు. అయితే అది ఎక్స్ పైరీ అయిన గ్రెనేడ్ అని స్పీకర్ ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం రాధాకృష్ణన్ మాట్లాడుతూ కేరళలో పోలీసు రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. నిరసనకారులను అణచివేసేందుకు ఇలాంటి హేయమైన చర్యలకు పోలీసులు దిగుతున్నారని మండిపడ్డారు. ఎక్స్ పైరీ అయిన వాటిని ప్రయోగిస్తే ప్రజారోగ్యం ఏం కావాలని నిలదీశారు. దీనిపై స్పందించిన కేరళ సీఎం విజయన్ ఘటనపై విచారణ జరుపుతామని హామీయిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.