యాప్నగరం

ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు

అవిశ్వాస తీర్మానంసై చర్చలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు సభను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్‌సభలో సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టింది.

Samayam Telugu 24 Jul 2018, 7:58 pm
విశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు సభను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఈ తీర్మాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో సభలో వాడీ వేడీ నెలకోనుంది.
Samayam Telugu Untitled


రాఫెల్ ఒప్పందంలో కోట్లాది రూపాయలు స్కామ్ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ ఒప్పందాన్ని బహిరంగ పరచకూడదనే నిబంధన ఉందని చెప్పారు. అయితే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇందులో ఎలాంటి రహస్యం లేదని తనతో చెప్పారని రాహుల్ వాదించారు. ఈ విషయంలో నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీలు సభను తప్పుతోవ పట్టించారని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.