యాప్నగరం

ఎంపీ కాన్వాయ్ బీభత్సం.. ముగ్గురి మృతి!

ఎంపీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రంజీత్‌ రంజన్ కాన్వాయ్‌ బీభత్సం సృష్టించింది. బిహార్‌లో నిర్మాలి - సికర్హత ప్రధాన రహదారిలో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి చెందిన ఓ వాహనం..

TNN 21 Aug 2017, 4:37 pm
ఎంపీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రంజీత్‌ రంజన్ కాన్వాయ్‌ బీభత్సం సృష్టించింది. బిహార్‌లో నిర్మాలి - సికర్హత ప్రధాన రహదారిలో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి చెందిన ఓ వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన సమయంలో రంజీత్‌తో పాటు ఉన్న నిర్మాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రామ్‌ప్రసేశ్ యాదవ్‌.. గాయపడిన వారిని తన వాహనంలో ఎక్కించుకొని సమీప ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu congress mp ranjeet ranjans convoy crushes 3 to death in bihar
ఎంపీ కాన్వాయ్ బీభత్సం.. ముగ్గురి మృతి!


సుపౌల్ నియోజకవర్గ ఎంపీ అయిన రంజీత్.. ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి పాట్నాకు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈమె జన్ అధికార్ పార్టీ అధినేత పప్పూ యాదవ్ భార్య కావడం గమనార్హం. డ్రైవింగ్ అంటే సరదాపడే రంజీత్ రంజన్ మహిళా దినోత్సవం రోజు (మార్చి 8) హార్స్‌లీ డేవిడ్‌సన్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.