యాప్నగరం

Bharat Jodo Yatra: రాహుల్ యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ హఠన్మరణం

Bharat Jodo Yatra: పంజాబ్‌లో కొనసాగుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఉదయం రాహుల్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. ఉన్నట్లుంది అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 14 Jan 2023, 11:06 am

ప్రధానాంశాలు:

భారత్ జోడో యాత్రలో విషాదం
గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ మృతి
విచారం వ్యక్తం చేసిన రాహుల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu santokh singh chaudhary
కాంగ్రెస్ ఎంపీ హఠన్మరణం
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ గుండెపోటుకు గురయ్యారు. పంజాబ్‌లోని ఫిల్లౌర్ వద్ద రాహుల్ ఈ ఉదయం యాత్ర ప్రారంభించగా.. జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంప సంతోఖ్ సింగ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కలిసి కాసేపు నడిచిన ఆయన.. ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ను అంబులెన్స్‌లో లూథియానాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ఆయన మృతి వార్త తెలియగానే రాహుల్ గాంధీ యాత్రను మధ్యలోనే ఆపేసి హుటూహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. సంతోక్ మృతి పట్ల రాహుల్ విచారం వ్యక్తం చేశారు.

సంతోఖ్ సింగ్ చౌదరీ అకాల మృతిపట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్‌లో సంతాపం ప్రకటించారు. ఆయన అకాల మరణం తనను బాధించిందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సంతోఖ్ మృతి పట్ల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్రంగా కలిచి వేసిందన్నారు. విషయం తెలిసిన వెంటనే రేవంత్ పంజాబ్ బయల్దేరి వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా.. సంతోఖ్‌ సింగ్‌ 1946 జూన్‌ 18న జలంధర్‌లోని ధలివాల్‌ ప్రాంతంలో జన్మించారు. పంజాబ్‌లో కాంగ్రెస్‌ హయాంలో కేబినెట్‌ మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జలంధర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన సంతోఖ్ సింగ్.. వరుసగా రెండు సార్లు విజయం సాధించారు.

గతేడాది నవంబర్‌ రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత గుండెపోటుతో మృతి చెందారు. మహారాష్ట్రలో పాదయాత్ర కొనసాగించిన సమయంలో నాందేడ్ వద్ద కాంగ్రెస్ సేవా దళ్ (Congress Seva Dal) ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ పాండే (75) గుండెపోటుకు గురై కన్నుమూశారు. పాండే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్ గాంధీ.. చివరి క్షణాల్లోనూ ఆయన జాతీయ జెండాను వదిలిపెట్టలేదని అన్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ భారత్ జోడో యాత్ర పేరిట 3,570 కిలోమీటర్ల పాదయాత్రను గతేడాది సెప్టెంబరు 7న రాహుల్ గాంధీ ప్రారంభించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి మొదలైన రాహుల్ యాత్ర... పలు రాష్ట్రాల గుండా ప్రస్తుతం పంజాబ్ చేరుకుంది. ఫిల్లౌర్ వద్ద రాహుల్ ఈ ఉదయం పాదయాత్ర ప్రారంభించగా.. కాసేపటికే ఎంపీ సంతోష్ అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.

రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.