యాప్నగరం

కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు సంస్థ లాంటిది: అమిత్ షా

కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు సంస్థ లాంటిదని.. నెహ్రూ, గాంధీ కుటుంబాలే దానికి యజమానులని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశం జోలికి ఎవరొచ్చినా మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు.

Samayam Telugu 30 Nov 2018, 3:41 pm
రాజస్థాన్‌లో బీజేపీ అధికారం తిరిగి నిలబెట్టుకుంటుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన రాజస్థాన్‌లోని నాగౌర్‌‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టాలో ప్రజలే తేల్చుకోవాలని షా అన్నారు. దేశభక్తులైన మోదీ, వసుంధర రాజె ఉన్న బీజేపీకి ఓటేస్తారో, సరైన విధానాలు, విలువలు లేని కాంగ్రెస్ ఓటేస్తారో నిర్ణయించుకోవాలన్నారు.
Samayam Telugu amit shah


కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు సంస్థ లాంటిదని.. నెహ్రూ, గాంధీ కుటుంబాలే దానికి యజమానులని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశం జోలికి ఎవరొచ్చినా మోదీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. మన జవాన్లను చంపిన తీవ్రవాదులపై మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేయించి వారిని తుదముట్టించిందని షా గుర్తుచేశారు. మహిళలకు గౌరవం కల్పించేందుకు రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం 80లక్షల మరుగుదొడ్లు కట్టించిందని తెలిపారు. రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పాటయ్యేందుకు నాగౌర్ నుంచి నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు.

200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో డిసెంబరు 7న పోలింగ్ జరగనుంది. 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.