యాప్నగరం

జయనగరలో కాంగ్రెస్ విజయకేతనం!

కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

Samayam Telugu 13 Jun 2018, 11:48 am
కర్ణాటక రాజధాని బెంగళూరు పరిధిలోని జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సౌమ్యారెడ్డి 3,775 ఓట్ల తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రహ్లాదపై విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో సౌమ్యారెడ్డి 54,045 ఓట్లను పొందగా, బీజేపీ అభ్యర్థికి 50,270 ఓట్లు వచ్చాయి. ఇతరులంతా కలిసి 1,591 ఓట్లను మాత్రమే పొందగలిగారు.
Samayam Telugu Congress


ఈ నెల 11న ఇక్కడ పోలింగ్ జరగింది. సార్వత్రిక ఎన్నికలతో పాటే జయనగర అసెంబ్లీ ఎన్నిక కూడా జరగాల్సింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే, పోటీలో ఉన్న అభ్యర్థి హఠాత్తుగా మరణించడంతో ఎన్నిక వాయిదా పడింది.

కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాజీ హోం మంత్రి రామలింగారెడ్డి తనయ సౌమ్యారెడ్డి పోటీలో ఉండటంతో ఈ నియోజకవర్గం ఫలితం మరింత ఆసక్తిదాయకంగా మారింది. ఒక దశలో సౌమ్యారెడ్డి భారీ మెజారిటీనే సాధించారు. ఆమె ఆధిక్యం 17వేల ఓట్ల వరకూ కూడా వెళ్లింది. అయితే చివర్లో బీజేపీ పుంజుకుంది. అయితే విజయం మాత్రం సౌమ్య వైపే మొగ్గింది. ఈ నియోజకవర్గంలో జేడీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. ఈ విజయంతో కర్ణాటకలో కాంగ్రెస్ బలం మరో సీటు పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.