యాప్నగరం

ఆ రెండు సీట్లలో కాంగ్రెస్, జేడీఎస్‌ల పొత్తు?

కర్ణాటకలో రాజకీయ రసవత్తర పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నాటకీయ పరిణామాల మధ్యన యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం

Samayam Telugu 21 May 2018, 4:23 pm
కర్ణాటకలో రాజకీయ రసవత్తర పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే నాటకీయ పరిణామాల మధ్యన యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం, రాజీనామా చేసి తప్పుకోవడం జరిగాయి. ఇక సీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 116 సీట్లు ఉన్నాయి. మినిమం మెజారిటీ కన్నా మూడు సీట్లు అదనంగా ఉంది వీరి బలం.
Samayam Telugu congress-jds


అయితే కర్ణాటకలో ఇంకా ఎన్నికలు జరగాల్సిన సీట్లు ఉన్నాయి. నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి మరణించడంతో జయనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నిక వాయిదా పడింది. అలాగే ఆర్ఆర్ నగర్ అసెంబ్లీ సీటు ఎన్నిక కూడా వాయిదా పడింది. ఈ రెండు సీట్లకూ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సీటూ కీలకమే. అందులోనూ నాటకీయ రాజకీయ పరిణామాల అనంతరం ఈ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ నేఫథ్యంలో ఈ రెండు సీట్లలో విజయం కోసం పరస్పరం సహకరించుకోవాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు నిర్ణయించాయి. ఎన్నికల ముందు ప్రత్యర్థులుగా పోటీ చేసి అమీతుమీ తలపడ్డ ఈ పార్టీలు ఇప్పుడు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జయనగర్, ఆర్ఆర్ నగర్ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. వీటిల్లో ఒక దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థిని జేడీఎస్, మరో దాంట్లో జేడీఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ సమర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇలా ఉమ్మడిగా పోటీ చేసి ఈ పార్టీలు తమ సత్తా ఎంతో చూపించనున్నాయి. ఇక ఈ సీట్ల ఎన్నికలకు బీజేపీ కూడా కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రులు సదానందగౌడ, అనంతకుమార హెగ్డేలు ఈ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.