యాప్నగరం

ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ బిల్డింగ్ పైనుంచి పడి పోలీస్ మృతి

Odisha: ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తన సెల్‌ఫోన్లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ భవనం మూడో అంతస్తు నుంచి పడిపోయి ఓ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 8 Oct 2020, 12:21 am
క్రికెట్ అభిమానులను ఐపీఎల్ ఊపేస్తోంది. సాయంత్రం అయిందంటే.. లైవ్ మ్యాచ్‌లు చూస్తూ గడిపేస్తున్నారు. ఇలాగే ఆటలో మునిగిపోయిన ఓ అభిమాని తాను బిల్డింగ్ మూడో అంతస్తులో పిట్ట గోడపై కూర్చొని ఉన్నాననే విషయం మరచిపోయాడు. ఆనందం పట్టలేక తన్మయత్వానికి గురయ్యాడు. దీంతో అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాల పాలై హాస్పిటల్ చికిత్స పొందుతూ మరణించాడు. మృతి చెందిన వ్యక్తి ఒడిశా స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ (OSAP) కానిస్టేబుల్‌ కావడం గమనార్హం. మంగళవారం (అక్టోబర్ 6) సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Constable falls off roof while watching IPL match on cellphone


ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా తెంటులిఖుంటికి చెందిన యోగేశ్వర్ దాస్ (27) ఒడిశా స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ 2013 బ్యాచ్‌కు ఎంపికయ్యారు. కోరాపూట్‌లో మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశారు. 5 నెలల కిందట బదిలీలో భాగంగా రాయగడకు వచ్చారు. అక్కడ చాంద్‌లీ ప్రాంతంలోని పోలీస్ బారక్‌‌లో నివాసం ఉంటున్నారు.

మంగళవారం సాయంత్రం యోగేశ్వర్ దాస్ తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్ భవనం థర్డ్ ఫ్లోర్‌లో ఓ అంచున కూర్చొని తన మొబైల్ ఫోన్‌లో ఐపీఎల్‌ క్రికెట్ మ్యాచ్‌ చూస్తున్నారు. ఆటలో లీనమైన యోగేశ్వర్‌ దాస్‌ ఆనందం పట్టలేక అదుపుతప్పి భవనం పైనుంచి కిందకు పడ్డారు.

కానిస్టేబుల్ యోగేశ్వర్ దాస్ భవనం పైనుంచి పడిపోయిన విషయం గమనించిన సహచరులు వెంటనే ఆయణ్ని స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు. యోగేశ్వర్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది.

Also Read: అమర జవాన్‌కు కుమారుడి సెల్యూట్.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.