యాప్నగరం

కూతురిపై గ్యాంగ్ రేప్.. తండ్రి గుండె ఆగింది

15 ఏళ్ల వయసున్న అమ్మాయిపై గ్రామపెద్ద, కానిస్టేబుల్ సహా ఏడుగురు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ వార్త తెలియగానే తండ్రి గుండె పగలింది.

TNN 20 Aug 2017, 6:41 pm
ఉత్తర ప్రదేశ్‌లో అధికారం చేతులు మారినా.. దారుణాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా యువతులపై అత్యాచారాలు అక్కడ సర్వ సాధారణం అయ్యాయి. ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. అమ్మాయిలపై ఆగడాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇటీవల ఓ టీనేజీ అమ్మాయిపై గ్రామపెద్ద, పోలీసు కానిస్టేబుల్ సహా ఏడుగురు అత్యాచారం చేశారు. ఈ వార్త వినగానే ఆ అమ్మాయి తండ్రి ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళితే..
Samayam Telugu constable village headman gangrape teen father dies of shock
కూతురిపై గ్యాంగ్ రేప్.. తండ్రి గుండె ఆగింది



ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఉన్న గోపాల్ ‌నగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికపై శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. ‘గ్రామ పెద్దతో కలిసి ధర్మప్రసాద్ అనే కానిస్టేబుల్ తనను కిడ్నాప్ చేశాడు. వారు నన్ను దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాల భవనంపైకి తీసుకెళ్లారు. వారిద్దరితోపాటు మరో ఐదుగురు తనను రేప్ చేశారు’ అని బాధితురాలు తెలిపింది. వారి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి ప్రయత్నించింది. కానీ వారి కండ బలం ముందు ఆమె నిలువలేకపోయింది. నిందితులతో బాలిక ఉండటాన్ని గమనించిన కొందరు గ్రామస్థులు స్కూల్ భవనంపైకి చేరుకున్నారు. ఈ విషయం పసిగట్టిన నిందితులు తప్పించుకొని పారిపోగా.. కానిస్టేబుల్‌ను బంధించిన గ్రామస్థులు అతణ్ని చితకబాదారు.

పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ కూతురిపై గ్యాంగ్ రేప్ జరిగిందనే వార్త తెలియగానే షాక్‌కు గురైన ఆమె తండ్రి కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. దీంతో బాధితురాలి కుటుంబం తీవ్ర వేదనకు గురైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.