యాప్నగరం

చెన్నై: కుప్పకూలిన భవనం.. కూలీ బతుకులు ఛిద్రం

నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద సుమారు 40 మంది కూలీలు చిక్కుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ శనివారం (జులై 21) రాత్రి 8 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Samayam Telugu 21 Jul 2018, 11:45 pm
నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద సుమారు 40 మంది కూలీలు చిక్కుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ శనివారం (జులై 21) రాత్రి 8 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికులు, సహాయక బృందాలు కలిసి ఇప్పటివరకూ 25 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో చిక్కుకున్న వారంతా భవన నిర్మాణంలో పనిచేస్తున్న కూలీలుగానే తెలుస్తోంది. ఘటనలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Samayam Telugu collapse


నగరంలోని పాత మహాబలిపురం కందన్‌చావడిలో ఈ ప్రమాదం జరిగింది. నాలగంతస్తుల భవనం పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిన అప్రమత్తమయ్యారు. శిథిలాల కింద నుంచి పలువురిని బయటకు తీసుకొచ్చారు.

సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు ఫైరింజన్లు, మూడు జేసీబీలతో ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ పనిచేసే కూలీలంతా దక్షిణ తమిళనాడులో ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది.

ఓఎంఆర్‌ రోడ్డులోని ఐటీ కారిడార్‌లో ఈ భవన నిర్మాణం జరుగుతోంది. భవనం కుప్పకూలడానికి స్పష్టమైన కారణాలేమీ తెలియరాలేదు. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకొని ఉంటారనే విషయంలోనూ స్పష్టత లేదు. భవనంపైకి ఈ రోజు పెద్ద మొత్తంలో ఇనుప సామగ్రిని తీసుకెళ్లారని, ఆ బరువు వల్లే భవనం కుప్పకూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.