కర్ణాటక ఎన్నికల షెడ్యూల్పై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంఘానికంటే ముందే ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ షెడ్యూల్ను ట్వీట్ చేశారు. ఈసీ అధికారికంగా ప్రకటన చేయకుండానే... ఇలా షెడ్యూల్ను బయటపెట్టడం సంచలనమయ్యింది. ఈ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో సీరియస్గా స్పందించింది. దీనిపై విచారణ జరుపుతామని... ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుంటామన్నారు. ఎన్నికల సంఘం ద్వారా ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు.
ఈ వ్యవహారంపై బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఎన్నికల సంఘంపై బీజేపీ పెత్తనం చెలాయిస్తుందని మండిపడింది. ఈసీ కంటే ముందు వాళ్లకు షెడ్యూల్ ఎలా వెళ్లిందన్నారు. వెంటనే సమాచారాన్ని లీక్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్పై ఈసీ కేసు పెడుతుందా... పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకి నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై బీజేపీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. ఎన్నికల సంఘంపై బీజేపీ పెత్తనం చెలాయిస్తుందని మండిపడింది. ఈసీ కంటే ముందు వాళ్లకు షెడ్యూల్ ఎలా వెళ్లిందన్నారు. వెంటనే సమాచారాన్ని లీక్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్పై ఈసీ కేసు పెడుతుందా... పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకి నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు.