యాప్నగరం

భారత్‌లో కరోనా కలకలం.. 18 లక్షలు దాటిన కేసులు

భారత్‌లో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు కోట్లమందికి కరోనా టస్టులు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 18 లక్షలమంది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 3 Aug 2020, 11:12 am
భారత్‌లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రతి రోజు 50 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. తాజాగా 53 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క రోజు వ్యవధిలోనే 18 లక్షల మార్కును దాటేశాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా...771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Samayam Telugu భారత్‌లో కరోనా కేసులు
corona virus


ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 2,02,02,858 కరోనా టెస్టుల నిర్వహించగా... గడచిన 24 గంటల్లో 3,81,027 టెస్టులను ఐసీఎంఆర్ నిర్వహించింది. దేశంలో కరోనా పరీక్షలు రెండు కోట్లు దాటాయి. మరోవైపు ఆగస్టు 2 వరకు మొత్తం 2,02,02,858 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. నిన్న ఒకే రోజు 3,81,027 నమూనాలను పరీక్షించామని తెలిపింది.
Read More: కర్ణాటక సీఎం కూతురుకు కరోనా పాజిటివ్..
మరోవైపు తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసులు కొంత మేర తగ్గాయి. కాస్త ఊరట నిచ్చేలా తెలంగాణ ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 67,660కి చేరింది. ఇందులో 48,609 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,500 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక హెల్త్ బులెటిన్ ప్రకారం తెలంగాణలో కొత్తగా 11 కరోనా మరణాలు సంభవించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.