యాప్నగరం

ఐసోలేషన్‌లో ఉక్క.. కరోనా రోగి వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్.. బాధితుడు మృతి

Corona Cases in India: ఐసోలేషన్‌ వార్డులో కూలర్‌ పెట్టుకొనేందుకు రోగి తరపు వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, నేరుగా కూలర్‌ను లోనికి తీసుకెళ్లారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ వ్యహారంపై హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.నవీన్‌ సక్సేనా కమిటీ వేశారు.

Samayam Telugu 20 Jun 2020, 5:54 pm
ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ వార్డులో రోగి కుటుంబసభ్యులు చేసిన తప్పిదం వైరస్ సోకిన వ్యక్తి మరణానికి దారి తీసింది. వార్డులో ఉక్కబోతగా ఉందని వెంటిలేటర్‌ ప్లగ్‌ తీసేసి ఎయిర్‌ కూలర్‌ ప్లగ్ పెట్టడంతో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు మరణించాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటుచేసుకుంది. ఈ నెల 13న కరోనా లక్షణాలతో సుమారు 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. కొవిడ్ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నెల 15 నుంచి ఆ వ్యక్తికి ఐసోలేషన్‌ వార్డులో కరోనా చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Gujrat coronavirus


ఇక ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చాలా వేడిగా ఉందని రోగి కుటుంబ సభ్యులు తమ ఇంటి నుంచి ఓ కూలర్ తెచ్చారు. దాన్ని బాధితుడి పడక వద్దే ఉంచారు. కూలర్ ఆన్ చేయాలంటే అక్కడ ఒకే సాకెట్ ఉండడంతో వెంటిలేటర్‌ ప్లగ్‌ను పీకేసి, కూలర్ ప్లగ్ పెట్టారు. కూలర్ ఆన్ చేశారు. ఆ వెంటనే అరగంట వ్యవధిలో రోగి ఊపిరాడక మరణించాడు. విషయాన్ని గమనించిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అదించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు మరణించాడని ధ్రువీకరించారు.

అయితే, ఐసోలేషన్‌ వార్డులో కూలర్‌ పెట్టుకొనేందుకు రోగి తరపు వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదని, నేరుగా కూలర్‌ను లోనికి తీసుకెళ్లారని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ వ్యహారంపై హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డా.నవీన్‌ సక్సేనా కమిటీ వేశారు. ఐసోలేషన్‌ వార్డులోని వైద్య సిబ్బంది ద్వారా పూర్తి సమాచారాన్ని కమిటీ సేకరించింది. కుటుంబ సభ్యులు మాత్రం కమిటీ విచారణకు సహకరించడం లేదు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.