యాప్నగరం

విషాదం.. కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రిలో వ్యక్తి సూసైడ్

ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషెంట్ రెండు సార్లు అక్కడ్నుంచి పారిపోయాడు. ఇంటికి వెళ్లడంతో గ్రామస్థులు అతడ్ని పట్టుకొని మళ్లీ ఆస్పత్రి సిబ్బందికి అప్పగించారు.

Samayam Telugu 11 Jun 2020, 9:17 am
కేరళలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకి కోలుకున్న తర్వాత ఆస్పత్రిలోనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరోనా నుంచి కోలుకున్న ఓ రోగి ఆసుపత్రి ఐసోలేషన్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరువనంతపురం వైద్యకళాశాల ఆసుపత్రిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే 33 ఏళ్ల వయసు గల ఓ వ్యక్తి కరోనా వైరస్ తో ఆసుపత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి నుంచి రెండు సార్లు పారిపోయాడు.
Samayam Telugu కేరళలో కరోనా రోగి ఆత్మహత్య


సొంత ఊరికి వెళ్లిన అతడ్ని గ్రామస్థులు పోలీసులకు పట్టించారు. దీంతో మళ్లీ ఆస్పత్రికి తరలించారు. మళ్లీ కరోనా పరీక్ష చేయడంతో నెగిటివ్ అని వచ్చింది. వైద్యులు అతన్ని డిశ్చార్జ్ చేద్దామనిసరేకి ఆ వ్యక్తి ఐసోలేషన్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు తిరిగి అధికారులకు అప్పగించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఇక మరోవ్యక్తి మద్యం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఇది కాస్త వివాదంగా మారె అవకాశం ఉండడంతో విచారణకు ఆదేశించింది కేరళ సర్కార్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.