యాప్నగరం

కరోనాతో మహిళ మృతి.. ఒంటిపై బంగారం మాయం

Uttar Pradesh: కరోనా బారిన పడి ఓ మహిళ మృతి చెందగా.. ఆమె ఒంటి పైనుంచి బంగారు నగలు మాయం చేశారు దొంగలు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 18 Sep 2020, 8:23 pm
రోనా వైరస్ ఓ వైపు దేశంలో కల్లోలం సృష్టిస్తుంటే.. కొంత మంది తమ నీచపు బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. కరోనా బారినపడి ఓ మహిళ మృత్యువాతపడటంతో ఆమె కుటుంబం తీరని దు:ఖంలో ఉండగా.. ఆ మృతదేహంపై నగలు మాయం చేశారు కొంత మంది కేటుగాళ్లు. ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క‌రోనా సోకుతుందనే భయంతో రోగి ద‌రిదాపుల్లోకి వెళ్లడానికే జ‌నం జంకుతుండగా.. దొంగ‌లు మాత్రం ఏకంగా క‌రోనా మృతుల‌ ఒంటి పైనుంచే బంగారాన్నే కాజేయడం విస్మయపరుస్తోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Woman dies with Covid-19


మృతురాలి ఒంటిపైన ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల గురించి ఆమె భ‌ర్త హాస్పిటల్ యాజ‌మాన్యాన్ని ప్రశ్నించ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 15న ఆమెను హాస్పిటల్‌లో చేర్పించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ మరుసటి రోజు ఉదయమే ఆమె మరణించినట్లు హాస్పిటల్ సిబ్బంది చెప్పినట్లు వెల్లడించారు.

Must Read: 15 సెకన్లలోనే కరోనా వైరస్ ఖతం.. తెలంగాణ పరిశోధకుడి ఆవిష్కరణ

Also Read: కరోనా విషాదం.. అంతటా నిరాశే, చివరికి తోపుడుబండిపై మృత‌దేహం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.