యాప్నగరం

కరోనా సోకినా విధుల్లోనే.. ఆరోగ్య మంత్రి సూపర్!

Rajasthan: కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. ఆ మంత్రి తన విధి నిర్వహణను మరవలేదు. కొవిడ్ ఆస్పత్రిలో ఇన్స్‌పెక్షన్ చేశారు. హాస్పిటల్ అంతా కలియతిరిగి కరోనా బాధితుల సమస్యలు, వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు.

Samayam Telugu 25 Nov 2020, 9:00 pm
రోగ్య మంత్రిగా కరోనా సంక్షోభ సమయంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా వైరస్ బారినపడ్డారు. సాధారణంగా అయితే.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారు.. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఐసోలేషన్‌లో ఉండి తగ్గేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, హాస్పిటల్‌లో అడ్మిట్ అయినా.. ఆ మంత్రి తన విధి నిర్వహణను పక్కన బెట్టలేదు.
Samayam Telugu రాజస్థాన్ ఆరోగ్య మంత్రి
Dedicated COVID hospital in Jaipur inspected by 'patient' health minister


తాను కొవిడ్-19తో అడ్మిట్ అయిన హాస్పిటల్‌లో సదుపాయాలు, రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆ ఆరోగ్య మంత్రి. కరోనా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, అక్కడి వైద్య సిబ్బంది వారితో ప్రవర్తిస్తున్న తీరుపై ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆ హాస్పిటల్‌లో త్వరలో మరో 70 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హాస్పిటల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన వార్డులను కలియతిరిగి పరిశీలించారు. ఆయనే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి డాక్టర్ రఘు శర్మ.

వీడియో: కరోనా పాజిటివ్‌తో ఆరోగ్య మంత్రి తనిఖీలు


కాగా.. ఆరోగ్య మంత్రి రఘు శర్మ తీరుపై బీజేపీ విమర్శల వర్షం కురిపించింది. ఆయన కొవిడ్-19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని మండిపడింది. కరోనా బారినపడ్డ ఆయన ఐసోలేషన్‌లో ఉండి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉండగా.. అధికారులతో కలిసి ఇలా హాస్పిటల్ అంతా కలియతిరగడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రచార ఆర్భాటం తప్ప మరొకటి కాదని ఆగ్రహం వ్యక్త చేశారు. మంత్రి చర్యలు కరోనా వైరస్ వ్యాప్తికి కారణమయ్యేలా ఉన్నాయని ఆరోపించారు.

Must Read: కరోనాకు కేంద్రం కొత్త నిబంధనలు.. డిసెంబర్ నెలకు

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం తమ నేత చర్యను సమర్థించుకుంటున్నారు. పార్టీ అభిమానులు మంత్రిని పొగడ్తల్లో ముంచెత్తున్నారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో డాక్టర్ రఘు శర్మ ఆర్‌యూహెచ్‌ఎస్ హాస్పిటల్‌లో చేరిన అనంతరం ఇదంతా జరిగింది.

RUHS ఆస్పత్రిని 8 నెలల కిందట కొవిడ్ హాస్పిటల్‌గగా మార్చిన తర్వాత ఆరోగ్య మంత్రి ఇన్స్‌పెక్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని పలు ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య మంత్రి తనిఖీల సమయంలో ఆ శాఖకు చెందిన పలువురు అధికారులు, రాష్ట్రంలోని ఇతర హాస్పిటళ్లకు చెందిన పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Don't Miss: కోడికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్..

Also Read: బతికే ఉన్నాడా.. మరి అంత్యక్రియలు చేసింది ఎవరికి? దేవుడా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.