యాప్నగరం

భారత్‌లో 9 వేలు దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే 796 మందికి కోవిడ్

భారత్‌లో గత 24 గంటల్లో 796 కరోనా కేసులు నమోదు కాగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ మన దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 9152కు చేరగా.. మరణాల సంఖ్య 308గా ఉంది.

Samayam Telugu 13 Apr 2020, 5:33 pm
భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 9 వేల మార్క్ దాటింది. మన దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 9,152కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 308 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. గత 24 గంటల్లోనే దేశంలో 796 కరోనా కేసులు నమోదు కాగా.. 35 మంది చనిపోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మృతుల్లో మహారాష్ట్రకు చెందిన వారు 22 మంది ఉండగా.. గుజరాత్‌కు చెందిన ముగ్గురు, బెంగాల్‌కు చెందిన ఇద్దరు, తమిళనాడు‌కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu corona virus test


ప్రస్తుతం దేశంలో 7987 యాక్టివ్ కేసులు ఉండగా.. 856 ఇప్పటి వరకూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడిన వారిలో 72 మంది విదేశీయులు కూడా ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 18.5 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడగా 1.14 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో అత్యధికంగా కరోనా బాధితులు ఉండగా.. ప్రాణ నష్టం కూడా ఇక్కడే ఎక్కువగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.