దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అంతేకాదు.. కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ టాప్ స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోవడం విశేషం. గత 71 రోజులుగా అగ్ర స్థానంలో కొనసాగుతున్న భారత్, రెండు రోజులుగా రెండో స్థానంలో నిలిచింది. అగ్ర రాజ్యం అమెరికా మళ్లీ టాప్ స్థానంలోకి వెళ్లిపోయింది. అమెరికాలో రెండు రోజులుగా భారత్ కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
గత రెండు రోజులుగా అమెరికాలో వరుసగా 66,131 మరియు 71,687 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇండియాలో 64,237 మరియు 62,587 కొత్త కేసులు నమోదయ్యాయి. 71 రోజుల తర్వాత అమెరికా కంటే తక్కువ రోజూవారి కేసులు నమోదవడం గమనార్హం. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కొవిడ్ మరణాల రేటు బాగా తగ్గింది.
సెప్టెంబర్ 17న దేశంలో 98,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇవే అత్యధికం. నాటి నుంచి కొత్తగా నమోదయ్యే కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇదే పంథా కొనసాగితే దేశంలో మరో 3 నెలల్లో వైరస్ అంతం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని కేంద్రం నియమించిన కమిటీ కూడా చెప్పింది. అయితే.. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
పండుగలు వస్తున్నాయి జాగ్రత్త..
పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడితే కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం నియమించిన కమిటీ హెచ్చరించింది. ఇందుకు కేరళను ఉదాహరణగా పేర్కొంది. కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఓనం పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడారని.. స్నేహితులు, బంధువులను ఎక్కువగా కలిశారని, ఆ తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని వివరించారు. నవరాత్రులు, దసరా, దీపావళి, క్రిస్ట్మస్ లాంటి పండుగలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని కమిటీ సూచించింది.
Must Read: కేరళకు ఏమైంది..?
Also Read: గుడ్ న్యూస్: భారతీయుల ఆయుష్షు బాగా పెరిగింది..
గత రెండు రోజులుగా అమెరికాలో వరుసగా 66,131 మరియు 71,687 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇండియాలో 64,237 మరియు 62,587 కొత్త కేసులు నమోదయ్యాయి. 71 రోజుల తర్వాత అమెరికా కంటే తక్కువ రోజూవారి కేసులు నమోదవడం గమనార్హం. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కొవిడ్ మరణాల రేటు బాగా తగ్గింది.
సెప్టెంబర్ 17న దేశంలో 98,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇవే అత్యధికం. నాటి నుంచి కొత్తగా నమోదయ్యే కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇదే పంథా కొనసాగితే దేశంలో మరో 3 నెలల్లో వైరస్ అంతం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని కేంద్రం నియమించిన కమిటీ కూడా చెప్పింది. అయితే.. కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
పండుగలు వస్తున్నాయి జాగ్రత్త..
పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడితే కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం నియమించిన కమిటీ హెచ్చరించింది. ఇందుకు కేరళను ఉదాహరణగా పేర్కొంది. కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఓనం పండుగ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడారని.. స్నేహితులు, బంధువులను ఎక్కువగా కలిశారని, ఆ తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని వివరించారు. నవరాత్రులు, దసరా, దీపావళి, క్రిస్ట్మస్ లాంటి పండుగలను కొవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని కమిటీ సూచించింది.
Must Read: కేరళకు ఏమైంది..?
Also Read: గుడ్ న్యూస్: భారతీయుల ఆయుష్షు బాగా పెరిగింది..