యాప్నగరం

తమిళనాడులో లక్ష దాటిన కరోనా కేసులు.. దేశంలో రెండో రాష్ట్రం

దేశంలో లక్ష కరోనా కేసులు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 1.86 లక్షల కేసులు నమోదు కాగా.. తమిళనాడులో కేసుల సంఖ్య 1.02 లక్షలకు చేరింది.

Samayam Telugu 3 Jul 2020, 8:35 pm
తమిళనాడులో కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్ష దాటింది. గత 24 గంటల్లో తమిళనాడులో 4329 కొత్త కేసులు నమోదు కాగా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై నగరంలోనే కొత్తగా 2082 పాజిటివ్ కేసులను గుర్తించారు. చెన్నై నగరంలో ఇప్పటి వరకూ 64,689 కరోనా కేసులున్నాయి. తమిళనాట మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 1,02,721కి చేరగా.. మరణాల సంఖ్య 1385కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Samayam Telugu Coronavirus
coronavirus


దేశంలో లక్ష కరోనా కేసులు దాటిన రెండో రాష్ట్రం తమిళనాడు కావడం గమనార్హం. ఇప్పటి వరకూ మహారాష్ట్రలో 1.86 లక్షల కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. మరో రెండు రోజుల్లో ఢిల్లీలోనూ కేసులు లక్ష దాటే అవకాశం ఉంది.

గత 24 గంటల్లో 33,488 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తం 12,35,692 శాంపిళ్లను టెస్ట్ చేశారు. కాగా తమిళనాడులో సామూహిక వ్యాప్తి లేదని ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.