యాప్నగరం

భారత్‌లో కరోనా మరణశాసనం.. 35 మంది మృతి!

భారత్‌లో కరోనా వైరస్ మరణాలు 35కు చేరినట్లు తెలుస్తోంది. అలాగే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,400 దాటినట్లు సమాచారం.

Samayam Telugu 31 Mar 2020, 9:39 pm
ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి భారత్‌లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటివరకు దాదాపు 200 దేశాలకు విస్తరించిన కొవిడ్‌ 19.. భారత్‌లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 1,400 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అలాగే, మృతుల సంఖ్య 35కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Samayam Telugu pjimage - 2020-03-27T200022.109


ఇవాళ (మంగళవారం) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 167 పైగా కేసులు నమోదవగా.. 13 మంది మృత్యువాత పడ్డారు. కాగా, ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య కూడా 123 మందికి పెరిగింది. అయితే, దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 97కు చేరుకుంది. వీరిలో 14 మంది కోలుకోగా, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 40 మందికి కోవిడ్ 19 సోకగా.. ఇద్దరు కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.