యాప్నగరం

కరోనా ఎఫెక్ట్: షాహీన్ బాగ్‌ను క్లియర్ చేయించిన పోలీసులు

కరోనా వైరస్ ప్రభావంతో దేశం మొత్తం లాక్‌డౌన్ కాగా.. ఢిల్లీలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ వ్యతిరేక ఆందోళనకు కేంద్రమైన షాహీన్ బాగ్ ఏరియాను ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు.

Samayam Telugu 24 Mar 2020, 8:43 am
కరోనా వైరస్ కారణంగా దాదాపు దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధించడంతో.. షాహీన్ బాగ్ ఏరియాను క్లియర్ చేశారు. దక్షిణ ఢిల్లీలోని షాహీన్ బాఘ్.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు కేంద్ర స్థానంగా కొనసాగిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఈ ప్రాంతాన్ని సీల్ చేసిన పోలీసులు.. భద్రతను కట్టుదిట్టం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రం అవుతున్న తరుణంలోనూ షాహీన్ బాఘ్ ప్రాంతంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆదివారం ఈ ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బాంబు విసిరారని ఆందోళనకారులు ఆరోపించారు.
Samayam Telugu shaheen bagh


పార్లమెంట్ పౌరసత్వ సవరణ చట్టానికి ఆమోదం తెలపడంతో 101 రోజులుగా షాహీన్ బాఘ్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. షాహీన్ బాగ్ ఏరియాను క్లియర్ చేసే క్రమంలో చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వెళ్లాలని పదే పదే వెళ్లాలని సూచించినప్పటికీ ఆందోళనకారులు కదలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆందోళనలు విరమించాలని గత వారమే పోలీసులు నిరసనకారులకు సూచించారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 500కి చేరువలో ఉండగా.. ఢిల్లీలో 30 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.