యాప్నగరం

దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కేసులు.. 6 వేలు దాటిన మరణాలు

దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 9304 పాజిటివ్ కేసులను గుర్తించగా.. మరో 260 మంది ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 4 Jun 2020, 9:33 am
దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 9304 కొత్త కేసులు నమోదు కాగా.. 260 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒకే రోజు భారీ సంఖ్యలో కేసులు పెరగడంతో భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య 2,16,919కి చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 1,06, 737 యాక్టివ్ కేసులు ఉండగా... 1,04,106 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
Samayam Telugu corona
coronavirus in india


మన దేశంలో కరోనా కారణంగా ప్రాణాలు వదిలిన వారి సంఖ్య 6,075కు చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో నమోదైన కేసుల్లో 60 శాతానికిపైగా ఈ నాలుగు రాష్ట్రాల్లోనే నమోదవుతుండటం గమనార్హం.

ప్రపంచంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అమెరికా ఉండగా.. తర్వాత బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఇటలీ ఉన్నాయి. మన దేశంలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే లక్షకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. మనదేశంలో ఇప్పటి వరకూ 40 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేశారు. రోజుకు 1.40 లక్షల కరోనా టెస్టులు చేసే స్థాయికి భారత్ చేరుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.