యాప్నగరం

కొత్త సమస్యలు.. అటువంటివాళ్లు ఫైజర్ టీకా వేయించుకోవద్దు: బ్రిటన్ సంచలన ప్రకటన

ప్రపంచంలోనే తొలిసారిగా ప్రాణాంతక కరోనా వైరస్‌కు వ్యాక్సినేషన్ బ్రిటన్‌లో రెండు రోజుల కిందట ప్రారంభమయ్యింది. అయితే, టీకా తీసుకున్నవారిలో అలర్జీల సమస్య తలెత్తాయి.

Samayam Telugu 10 Dec 2020, 1:31 pm
కరోనా వైరస్‌కు టీకా అత్యవసర వినియోగం బ్రిటన్‌లో మంగళవారం ప్రారంభమయి విషయం తెలిసిందే. అయితే, వ్యాక్సినేషన్ ప్రారంభం కాగానే, కొత్త సమస్యలు తలెత్తాయి. ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న ఇద్దరు నేషనల్ హెల్త్ సర్వీస్‌కు చెందిన సిబ్బంది తీవ్ర అస్వస్థత గురయ్యారు. 24 గంటల వ్యవధిలో ఒళ్లంతా దురద, దద్దుర్లు, రక్త ప్రసరణలో తేడాలు వంటి దుష్ప్రభావాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన బ్రిటషన్ ఔషధ నియంత్రణా సంస్థ.. కీలక ప్రకటన చేసింది.
Samayam Telugu ఫైజర్ టీకా


Read Also:
భూమిపై ఏలియెన్స్ నిజమేనా.. అమెరికాతో ప్రయోగాలకు ఒప్పందం చేసుకున్నారా?!

గతంలో ఏవైనా ఔషధాలు, ప్రత్యేకమైన ఆహారం కానీ తీసుకున్న సమయంలో అలర్జీ వచ్చినవాళ్లు కరోనా టీకాను తీసుకోవద్దని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు, వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారి మెడికల్ హిస్టరీని పరిశీలించాలని, అలర్జీలు ఏమైనా ఉంటే వారికి టీకాను వేయవద్దని ఆదేశించింది. ఏ వ్యక్తయినా గతంలో ఔషధాలు, ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అలర్జీ వంటి దుష్ప్రభావాన్ని ఎదుర్కొంటే ప్రస్తుతం ఫైజర్ టీకాను తీసుకోవద్దని బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రైనీ అన్నారు.

Read Also: ప్రపంచ మానవహక్కుల దినోత్సవం.. ఐరాస డిక్లరేషన్ ఏం చెబుతోంది?

‘టీకా వేయించుకున్న చాలా మందికి అలర్జీ రాదు.. కోవిడ్-19 నుంచి ప్రజలను రక్షించి ప్రమాదాలను అధిగమించవచ్చు.... ఈ టీకా భద్రత, నాణ్యత, ప్రభావం ఎంహెచ్ఆర్ఏ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పూర్తిగా నమ్మవచ్చు’ పేర్కొన్నారు. కొత్తగా వచ్చే వ్యాక్సిన్లు తీసుకునే వారిలో దుష్ప్రభావం తలెత్తడం చాలా సహజమని, దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. దుష్ప్రభావాలు కనిపించిన ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలూ కోలుకుంటున్నారని వెల్లడించారు.

Read Also: కొత్త పార్లమెంట్ భవనానికి మోదీ శంకుస్థాపన.. భారతీయత ఉట్టిపడేలా నిర్మాణం

ఏదైనా టీకా, ఔషధం తీసుకున్నప్పుడు శరీర రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిస్తే వైద్య పరిభాషలో దానిని అనాఫిలాక్సిస్ అంటారు. ఇది తీవ్రమైందే కాదు, ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది. అనాఫిలాక్సిస్ నుంచి ప్రత్యేకంగా ప్రమాదం ఉందని స్పష్టం చేస్తూ, నిపుణులను సంప్రదించిన తరువాత ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో ఔషధాలు తీసుకున్నప్పుడు అలెర్జీకి గురయితే ఫైజర్ కరోనా టీకా తీసుకోవద్దని సలహా ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.