యాప్నగరం

‘ఉగ్ర’ సంస్థల్లో ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టుకో: ఒవైసీకి స్వామి కౌంటర్

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పడూ వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా ‘దేశభక్తి’ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కౌంటర్ ఇచ్చారు.

TNN 15 Feb 2018, 6:07 pm
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పడూ వార్తల్లో నిలిచే బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా ‘దేశభక్తి’ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థల్లో చేరుతూ సైన్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఏ మతానికి చెందినవారో లోతుగా ఆలోచించాలని హితవుపలికారు. ‘ముస్లింలైన సైనికులు ఎంత మంది చనిపోయారో ఒవైసీ లెక్కపెట్టగలరు. కానీ ఎంత మంది ముస్లింలు ఉగ్రవాద సంస్థల్లో చేరి ఆర్మీపై దాడి చేస్తున్నారో కూడా ఆయన లెక్కించాలి’ అని స్వామి ట్వీట్ చేశారు.
Samayam Telugu count how many muslims are in terror organisations subramanian swamy to owaisi
‘ఉగ్ర’ సంస్థల్లో ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టుకో: ఒవైసీకి స్వామి కౌంటర్


జమ్మూలోని సుంజ్వాన్ సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు సైనికులు సహా ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ఉగ్రదాడిలో అమరులైన ఏడుగురు సైనికుల్లో ఐదుగురు కశ్మీరీ ముస్లింలు ఉన్నారని, దేశం పట్ల త‌మ‌కున్న చిత్తశుద్ధి, ప్రేమను ప్రశ్నించే వారికి, కుహూనా జాతీయవాదులకు ఈ ఉదంతం కనువిప్పు కావాలని ఒవైసీ వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణత్యాగాలకు పాల్పడుతోన్న ముస్లింలను కొందరు పాకిస్థానీయులు అంటూ ముద్రవేస్తున్నారని అసదుద్దీన్ మండిప‌డ్డారు. ఒవైసీ వాఖ్యలకు స్వామి పై విధంగా కౌంటర్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.