యాప్నగరం

పోలీసులపై నాటు బాంబులు.. కాన్పూర్ తరహా దుశ్చర్య, ఇద్దరి మృతి

Tuticorin: హత్య కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు నాలు బాంబులు విసిరారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌తో పాటు ఓ రౌడీషీటర్ మరణించాడు. తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Samayam Telugu 18 Aug 2020, 9:32 pm
మిళనాడులోని తూత్తుకుడిలో కాన్పూర్ తరహా ఘటన చోటు చేసుకుంది. అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితులు నాటుబాంబులు విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. తూత్తుకుడి జిల్లా మణక్కరై ప్రాంతంలో మంగళవారం (ఆగస్టు 18) జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Tuticorin Bomb Attack


రెండేళ్ల కిందట జరిగిన జంట హత్యల కేసులో ప్రత్యేక పోలీసు బృందం నిందితులను అరెస్ట్‌ చేసేందుకు వెళ్లగా.. రౌడీ షీటర్లు పోలీసులపై నాటుబాంబులు విసిరారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ సుబ్రమణ్యం, బాంబు విసిరిన రౌడీ షీటర్‌ దురై ముత్తు మృతి చెందారు. మరో కానిస్టేబుల్‌ గాయపడ్డారు.

నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పరారయ్యారని పోలీసులు తెలిపారు. నిందితుల వాహనంతో పాటు ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జయకుమార్‌ పరిశీలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Video: వరద నీటిలో తెగింపు.. బైక్‌తో పాటు కొట్టుకుపోయిన యువకులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.