యాప్నగరం

పొరిగింటి వ్యక్తిని కొట్టి చంపిన భార్యాభర్తలు.. కారణం వింటే షాక్

చిన్న, చిన్న కారణాలు.. క్షణికావేశం నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొడుకును తండ్రే దారుణంగా కొట్టి చంపిన ఘటనను మర్చిపోకముందే.. ముంబైలోనూ అలాంటి ఘటనే జరిగింది.

Samayam Telugu 23 May 2018, 6:00 pm
చిన్న, చిన్న కారణాలు.. క్షణికావేశం నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. కొడుకును తండ్రే దారుణంగా కొట్టి చంపిన ఘటనను మర్చిపోకముందే.. ముంబైలోనూ అలాంటి ఘటనే జరిగింది. ఫోన్ నెంబర్ అడిగాడనే కోపంతో.. ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు భార్యాభర్తలు. చెంబూరులోని కృష్ణ మీనన్ నగర్‌లో యశ్వంత్, మీనా ఝాడేల దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ పక్కనే రాకేష్ షిండే అనే వ్యక్తి ఇల్లు కూడా ఉంది. రెండు రోజుల క్రితం యశ్వంత్ తన సొంత పనిమీద పుణె వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రాకేష్.. యశ్వంత్ ఇంటికి వెళ్లాడు. అతడి భార్యను ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగ్గా.. ఆమె నిరాకరించింది.
Samayam Telugu Murder


పుణె నుంచి తిరిగొచ్చిన భర్తకే జరిగిన విషయాన్ని మీనా చెప్పింది. అతడికి కోపం కట్టలు తెంచుకుంది.. అంతే భార్యను వెంటబెట్టుకొని షిండే ఇంటికి వెళ్లాడు. అతడి కాళ్లను భార్య పట్టుకోగా.. యశ్వంత్ పిడిగుద్దులు కురిపించాడు. షిండే ఛాతికి చెయ్యి బలంగా తగలడంతో.. కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈలోపు చుట్టుపక్కల వాళ్లు గుమ్మిగూడటంతో దంపతులు దొరికిపోయారు. వారిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.