యాప్నగరం

కరోనా కేసులు: 4వ స్థానానికి ఎగబాకిన భారత్

Delhi: భారత్‌లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనా కేసుల్లో బ్రిటన్‌ను దాటి నాలుగో స్థానానికి చేరింది. టాప్ 10లో నిలిచిన కేవలం 18 రోజుల్లోనే నాలుగో స్థానానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది.

Samayam Telugu 11 Jun 2020, 9:42 pm
రోనా మహమ్మారితో అలుపెరుగని పోరాటం చేస్తున్న భారత్‌ను కలవరపెట్టే వార్త ఇది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను దాటేసింది. గురువారం (జూన్ 11) సాయంత్రం నాటికి అందిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 2,93,754 కరోనా కేసులు నమోదయ్యాయి. 2,91,588 కేసులతో నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ను అధిగమించి కేసులు నమోదయ్యాయి. ఇక అమెరికా, బ్రెజిల్‌, రష్యాలో మాత్రమే భారత్ కంటే ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయి. భారత్‌లో కరోనాతో సుమారు 8 వేల మంది మరణించారు.
Samayam Telugu కరోనా కేసుల్లో 4వ స్థానానికి భారత్
India Coronavirus Cases


అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలను దాటింది. ఆ దేశంలో లక్షలాది మరణాలు సంభవించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక మరో పెద్ద దేశం బ్రెజిల్..7.72 లక్షల కేసులతో రెండో స్థానంలో ఉంది. 4.93 లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది. భారత్ మే 24న టాప్ 10 జాబితాలోకి చేరగా.. కేవలం 18 రోజుల్లోనే నాలుగో స్థానానికి ఎగబాకడం గమనార్హం. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ఇటలీ, స్పెయిన్ లాంటి దేశాలను దాటుకుంటూ నాలుగో స్థానానికి చేరుకుంది.

లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చి వివిధ కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చిన తర్వాత భారత్‌లో కేసులు ప్రమాదకర రీతిలో పెరుగుతున్నాయి. గత 8 రోజుల్లోనే 80 వేల కేసులు, 2 వేలకు పైగా మరణాలు చోటు చేసుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో కరోనా కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. ఆ రాష్ట్ర కేసులు ఇప్పటికే చైనాను దాటేశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.