యాప్నగరం

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. ప్రతి ఐదు రోజులకు 1,000 మంది బలి

కరోనా వైరస్ కేసుల్లో ఇటలీ, సౌదీ ఆరేబియా, జర్మనీ దేశాలను మహారాష్ట్ర మించిపోయింది. మరణాల్లోనూ కెనడా, జర్మనీలను దాటేసింది. మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలోనూ దీనిలో సగం మరణాలు నమోదయ్యాయి.

Samayam Telugu 12 Jul 2020, 1:54 pm
దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు, కోవిడ్-19 మరణాలు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ అక్కడ 2.46 లక్షల మందికి వైరస్ సోకగా.. 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత 25 రోజులుగా కరోనా కారణంగా ప్రతి ఐదు రోజులకు 1,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో అధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఒకటై మహారాష్ట్ర కోవిడ్ మరణాల్లో జర్మనీ (9,069), కెనడా (8,811) దేశాల కంటే ముందు వరుసలో ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తొలిసారి వెలుగుచూసిన చైనాలో కోవిడ్-19 మరణాలు (4,641) మహారాష్ట్రలో సగం ఉన్నాయి.
Samayam Telugu మహరాష్ట్రలో కరోనా మరణాలు
Coronavirus Deaths in Maharashtra


దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 22,569 మంది ప్రాణాలు కోల్పోగా.. మహారాష్ట్ర వాటా 45 శాతంగా ఉంది. కరోనా మరణాల సంఖ్యను దాచిపెడుతున్నారని విమర్శలు రావడంతో జూన్ 16న గణాంకాలను అధికారులు సవరించగా.. ఒక్క రోజే మరో 1,329 అదనంగా నమోదయ్యాయి. దీంతో అప్పటికి మహారాష్ట్రలో 5,537 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సవరణలు వెలువరించిన ఐదు రోజుల్లోనే జూన్ 21కి మరణాల సంఖ్య 5,537 నుంచి 6,170 మార్క్ దాటింది.

ముంబయిలో 5,244 మంది ప్రాణాలు కోల్పోగా.. తర్వాత థానే జిల్లాలో 1,598 మంది చనిపోయారు. జూన్ 16 నాటికి ఇక్క 641 మంది ప్రాణాలు కోల్పోగా.. అప్పటి నుంచి 25 రోజుల్లో మరో 957 మంది బలయ్యారు. జూన్ 16 నుంచి ఇప్పటి వరకు ముంబయి నగరంలో 2,077 మృతిచెందారు. అంతకు ముందు కరోనా మృతుల సంఖ్య 3,167గా నమోదయ్యింది. ముంబయిలో మే రెండో వారం తర్వాత ఉద్ధృతంగా ఉన్న వైరస్.. ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందనడానికి ఇదే ఉదాహరణ.

ప్రస్తుతం మహారాష్ట్రలో వైరస్ కీలక దశకు చేరుకునేందుకు సిద్ధంగా ఉందని ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫీజీషియన్స్ డీన్ డాక్టర్ శశాంక్ జోషి అన్నారు. మహారాష్ట్రలో మరో రెండు వారాల వరకూ వైరస్ ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ముంబయి మెట్రోపాలిటిన్ ప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుంటే.. పుణే, జలగావ్, ఔరంగాబాద్‌లో కేసులు పెరగడం ఆధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

అయితే, నిర్ధారణ పరీక్షలు పెరగడం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖకు చెందిన వైద్యుడు తెలిపారు. రాష్ట్రంలో 110 ల్యాబొరేటరీలో అందుబాటులో ఉన్నాయని డాక్టర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడం వల్లే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని మరో వైద్యుడు పేర్కొవడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.