యాప్నగరం

11,000 మంది ఖైదీల విడుదల.. యోగి సర్కార్ సంచలన నిర్ణయం

Coronavirus in India: కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 11 వేల మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

Samayam Telugu 28 Mar 2020, 10:48 pm
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కోవిడ్ 19) ప్రబలుతున్న నేపథ్యంలో 71 జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 11,000 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఏడేళ్లు అంతకన్నా తక్కువ కాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ వెల్లడించింది. పెరోల్‌, మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు అత్యున్నత కమిటీలు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu shaheen 3


‘‘సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమ ప్రభుత్వం జస్టిస్‌ పంకజ్‌ కుమార్‌ జైశ్వాల్‌ నేతృత్వంలో మార్చి 27న అత్యున్నత కమిటీని ఏర్పాటు చేసింది. గరిష్ఠంగా ఏడేళ్ల శిక్ష పడిన ఖైదీలకు వ్యక్తిగత పూచీకత్తుపై 8 వారాల పాటు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. వెంటనే వారిని విడుదల చేయాలని సూచించింది’ అని ఆ యోగి సర్కార్ వెల్లడించింది.

ఇందులో భాగంగా 11 వేల మంది విడుదలకు రంగం సిద్ధమైందని వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటి వరకు కొవిడ్‌ 19 కేసులు 50కి పైగా నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.