యాప్నగరం

Coronavirus Death Toll in India: భారత్‌లో నాలుగో కరోనా మరణం

భారత్‌లో కరోనా వైరస్ కారణంగా నాలుగో మరణం సంభవించింది. పంజాబ్‌లో 72 ఏళ్ల వృద్ధుడు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 19 Mar 2020, 7:21 pm
భారత్‌లో నాలుగో కరోనా వైరస్ మరణం చోటు చేసుకుంది. ఇటలీ నుంచి జర్మనీ మీదుగా భారత్ తిరిగొచ్చిన 72 ఏళ్ల ఓ వృద్ధుడు పంజాబ్‌లో కరోనా కారణంగా చనిపోయాడు. తీవ్రమైన ఛాతి నొప్పి కారణంగా నవాన్‌షహర్ జిల్లాలోని హాస్పిటల్‌లో అతడు ప్రాణాలు వదలగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్‌లో తొలి కరోనా మరణం కర్ణాటకలో సంభవించిన సంగతి తెలిసిందే. గుల్బర్గాకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు మక్కా నుంచి తిరిగొచ్చాక కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. అతడు హైదరాబాద్‌లోనూ చికిత్స పొందాడు.
Samayam Telugu woman death


ఢిల్లీకి చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. భారత్‌లో సంభవించిన రెండో కరోనా మరణం ఇది. తర్వాత మహారాష్ట్రలో 68 ఏళ్ల వృద్ధుడు ఒకరు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి చనిపోయిన నలుగురూ సీనియర్ సిటిజన్లే కావడం గమనార్హం. కరోనా ప్రభావం ఎక్కువగా వృద్ధులపైనే ఉంటుందనడానికి ఈ మరణాలే ఉదాహరణగా భావించొచ్చు. ఇరాన్‌లో కరోనా సోకిన ఓ భారతీయుడు చనిపోయాడని విదేశాంగ శాఖ ప్రకటించింది.

భారత్‌ ప్రస్తుతం కరోనా రెండో దశలో ఉంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి తిరిగొచ్చిన వారికి, వారిని కాంటాక్ట్ అయిన వారికి మాత్రమే కరోనా వైరస్ సోకుతోంది. దీంతో కరోనాను అడ్డుకోవడం కోసం దేశంలోని స్కూళ్లను మార్చి 31 వరకు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐఎస్ఈ బోర్డు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. భారత్‌లో ఇప్పటి వరకూ 192 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రజారవాణాను మూసివే యాలని పంజాబ్ నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా.. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Read Also: శ్రీనివాసుడిపై కరోనా ప్రభావం.. చరిత్రలో తొలిసారి తిరుమల దర్శనం మూసివేత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.