యాప్నగరం

కరోనా పాజిటివ్.. ఆస్పత్రి పైనుంచి దూకిన జర్నలిస్ట్, ఉద్యోగం నుంచి తీసేయడంతో..

AIIMS Delhi: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. కరోనాకు చికిత్స పొందుతున్న ఓ జర్నలిస్టు నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. ఆయనకు కరోనా సోకడంతో సంస్థ ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 6 Jul 2020, 5:09 pm
రోనాకు చికిత్స తీసుకుంటున్న ఓ వ్యక్తి ఆస్పత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆత్మహత్యాయత్నం చేసిన 34 ఏళ్ల ఆ వ్యక్తి ఢిల్లీలో ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ కరోనా మహమ్మారి బారిన విషయం తెలియడంతో యాజమాన్యం అతడిని విధుల్లో నుంచి తప్పించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన బాధితుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
Samayam Telugu ఎయిమ్స్‌లో జర్నలిస్టు ఆత్మహత్యాయత్నం
Journalist Suicide attempt in AIIMS Delhi


కొద్ది రోజుల కిందట కరోనా పాజిటివ్‌గా తేలడంతో సదరు జర్నలిస్ట్‌‌ను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు సోమవారం (జులై 6) మధ్యాహ్నం ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకారు. అక్కడున్న సిబ్బంది వెంటనే గమనించి ఆయణ్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.

నాలుగో అంతస్తు పైనుంచి దూకడంతో బాధితుడడికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కదిలే కారులో సెక్స్.. వీడియో వైరల్, ఆ అధికారులిద్దరిపై UNO చర్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.