యాప్నగరం

ముఖ్యమంత్రులతో మోదీ అత్యవసర సమావేశం.. కరోనాపై కీలక నిర్ణయం!

India Covid-19: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Samayam Telugu 17 Mar 2021, 2:39 pm
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో మోదీ అత్యవసరంగా సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశం బుధవారం (మార్చి 17) మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రులతో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అనంతరం కరోనా నియంత్రణకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Samayam Telugu ప్రధాని మోదీ
PM Narendra Modi


85 రోజుల తర్వాత దేశంలో మళ్లీ గరిష్టంగా కేసులు నమోదయ్యాయి. సోమవారం 26,291 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339కు ఎగబాకింది.
చైనా: గబ్బిలాల్లో వైరస్.. కరోనా లాంటి లక్షణాలే!
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 118 మంది మరణించారు. దీంతో దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 1,58,725కు చేరుకుంది. 8 రాష్ట్రాల్లో వైరస్ ప్రభావం ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహారాష్ట్రతో పాటు తమిళనాడు, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది.

Also Read:

కన్నీటి దృశ్యం: బిడ్డను కాపాడి ప్రాణాలు కోల్పోయిన ఏనుగు

పెళ్లి కావట్లేదు, పిల్లను వెతకండి సర్.. పోలీసుల వద్దకు యువకుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.