యాప్నగరం

కోవిడ్ పేరుతో ఎన్నికల వాయిదా వేయమని చెప్పలేం.. బీహార్ ఎన్నికలపై సుప్రీం

కరోనా వైరస్ కారణంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

Samayam Telugu 28 Aug 2020, 12:33 pm
కరోనా వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున బీహార్ శాసనసభ ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేయమని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించలేమని వ్యాఖ్యానించింది. కోవిడ్ పేరు చెప్పి ఎన్నికల సంఘం అధికారుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయినా, బీహార్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ జారీచేయలేదని ప్రస్తావించింది.
Samayam Telugu సుప్రీంకోర్టు


ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏం చేయాలనేది న్యాయస్థానం చెప్పబోదని, అన్ని విషయాలు ఆయనకు తెలుసని వ్యాఖ్యానించింది. ఇది అవగాహనలేని పిటిషన్‌.. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాలేదు. ఎన్నికలు నిర్వహించవద్దని ఎన్నికల సంఘాన్ని ఎలా ఆదేశించాలి? ఎన్నికలు వాయిదా వేయడానికి కోవిడ్ సరైన కారణం కాదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలను ఎన్నికల కమిషన్ తీసుకుంటుందని పిటిషనర్‌కు తెలిపింది. ఈ ఏడాది నవంబరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. దీనిపై ఇప్పటి వరకూ కేంద్రం ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో అవినాష్ ఠాకూర్ అనే వ్యక్తి ఎన్నికలను వాయిదా వేయాలని ఈసీని ఆదేశించమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.