యాప్నగరం

పాన్ మసాలా కోసం పారిపోయిన కరోనా రోగి

Agra: ఆగ్రాలో ఓ కరోనా రోగి ఆస్పత్రి నుంచి పారిపోయాడు. పాన్ మసాలా తినాలనిపించి ఐసోలేషన్ వార్డు నుంచి పారిపోవడం గమనార్హం.

Samayam Telugu 15 Jul 2020, 12:04 am
స్పత్రి నుంచి తప్పించుకొని పారిపోయిన కరోనా రోగులను ఇంతకుముందు చూశాం గానీ.. ఇతగాడిది ప్రత్యేకమైన కేసు. కరోనా వైరస్‌ కారణంగా ఓ వైపు జనమంతా భయపడి చస్తుంటే.. ఈ రోగికి పాన్ మసాలా కావాల్సి వచ్చింది. పాన్ నమిలే వ్యసనం అతణ్ని ఏకంగా ఆస్పత్రి నుంచే తప్పించుకొని పారిపోయేలా చేసింది. అతడి కోరిక కారణంగా స్నేహితుడి బంధువుల కుటుంబానికి పెద్ద చిక్కొచ్చి పడింది. అదెలాగో చూడండి..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Agra Corona Patient run away for Pan Masala


ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందట కరోనా సోకింది. దీంతో అతడిని స్థానిక ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత కొవిడ్‌ రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఆ వ్యక్తికి పాన్‌ మసాలా తినే అలవాటు వ్యసనంగా మారింది. ఐసోలేషన్ కేంద్రంలో అలాంటివి దొరికే సమస్యే లేదు. కొంత మంది సిబ్బంది సాయంతో ఆస్పత్రి చుట్టుపక్కల దొరుకుతుందేమోని ప్రయత్నించాడు. అయినా.. నిరాశే ఎదురైంది.

పాన్ మసాలా లేక రోజు రోజుకూ నాలుక లాగుతోంది. దీంతో సిబ్బంది కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి తప్పించుకొని పోయాడు. అయితే.. ఆగ్రాలో లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో ఎక్కడా పాన్ షాపు తెరిచిలేదు. దీంతో గాంధీ నగర్ వెళ్లిపోయాడు. అక్కడ ఓ పాన్ షాపు తెరిచి ఉండటంతో అతడి ప్రాణం లేచొచ్చింది. పాన్‌ తిని, మరికొన్ని పాన్‌లను పార్శిల్‌ చేయించుకొని జేబులో వేసుకున్నాడు. అనంతరం అక్కడ నుంచి నేరుగా తన స్నేహితుడి బంధువు ఇంటికి వెళ్లాడు. తనకు కరోనా సోకిందని.. ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాలని కోరాడు. ఆ వార్త విని వాళ్లు షాక్‌కు గురయ్యారు.

అధికారులతో కలిసి ఆస్పత్రి సిబ్బంది ఆ రోగి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చివరకు అతడు గాంధీ నగర్‌లోని ఓ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి అక్కడకు చేరుకున్నారు. అతడిని పట్టుకొని తిరిగి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. రోగి స్నేహితుడి బంధువు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

పాన్‌ మసాలా కోసమే ఆ రోగి బయటకు వెళ్లాడని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. అతడి మానసిక పరిస్థితిపై దృష్టి సారించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి కదలికపై గట్టి నిఘా పెట్టినట్లు సిబ్బంది వెల్లడించారు.

Also Read: Hyd: కిరాయి అడిగినందుకు కొడవలితో దాడి..

Must Read: మళ్లీ కలిసిన ఆవు, ఎద్దు.. మధుర ప్రేమ కథ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.