దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ఢిల్లీలో గత పది రోజుల (Delhi Covid Cases)నుంచి భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 18 శాతానికి (Delhi Positivity Rate) చేరుకుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు (Delhi Mask Rules) తప్పనిసరి చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రతి ఒక్కళ్లూ మాస్క్లు ధరించాలని, లేనిపక్షంలో రూ.500 జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. దక్షిణ ఢిల్లీ అదనపు కలెక్టర్ కార్యాలయం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం.. అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి.. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా. అయితే, సొంత కార్లలో ప్రయాణించేవారికి ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది.
ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 2,146 కొత్త కేసులు నమోదుకాగా.. 8 మంది మృతిచెందారు. అక్కడ 180 రోజుల తర్వాత ఈ స్థాయిలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.83 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరి 13న 12 కరోనా మరణాలు నమోదుకాగా.. ఆ తర్వాత బుధవారం నాటి మరణాలే అధికం. మంగళవారం ఢిల్లీలో 2,495 కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఢిల్లీ ప్రభుత్వం మాస్క్ నిబంధనలను ఎత్తివేసింది. అయితే ఆ వెంటనే కోవిడ్ కేసుల పెరుగుదల మొదలుకావడంతో మాస్క్లు తప్పనిసరి, జరిమానా రెండూ వారాల వ్యవధిలోనే అమలు చేసింది. అయినప్పటికీ, బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్కు తగిన ప్రవర్తనను నిర్వహించడంలో ప్రజలు అలసత్వం వహిస్తుండటంతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది.
మరోవైపు, ఢిల్లీలో ఒమిక్రాన్ (Omicron Sub Variant) కొత్త వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ ఉపవర్గం బీఏ. 2.75 వేరియంట్ (BA-2.75 Variant) ను గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు. జన్యు విశ్లేషణకు పంపిన 90 మంది నమూనాల్లో కొత్త వేరియంట్ ఉన్నట్టు గుర్తించామని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ కొత్త సబ్-వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, కోవిడ్ యాంటీబాడీలున్న వ్యక్తులు కూడా వైరస్ బారినపడతారని పేర్కొన్నారు.
ఢిల్లీలో గడచిన 24 గంటల్లో 2,146 కొత్త కేసులు నమోదుకాగా.. 8 మంది మృతిచెందారు. అక్కడ 180 రోజుల తర్వాత ఈ స్థాయిలో మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.83 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరి 13న 12 కరోనా మరణాలు నమోదుకాగా.. ఆ తర్వాత బుధవారం నాటి మరణాలే అధికం. మంగళవారం ఢిల్లీలో 2,495 కొత్త కేసులు బయటపడ్డాయి.
మరోవైపు, ఢిల్లీలో ఒమిక్రాన్ (Omicron Sub Variant) కొత్త వేరియంట్ బయటపడింది. ఒమిక్రాన్ ఉపవర్గం బీఏ. 2.75 వేరియంట్ (BA-2.75 Variant) ను గుర్తించినట్టు అధికారులు ప్రకటించారు. జన్యు విశ్లేషణకు పంపిన 90 మంది నమూనాల్లో కొత్త వేరియంట్ ఉన్నట్టు గుర్తించామని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ బుధవారం తెలిపారు. ఈ కొత్త సబ్-వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని, కోవిడ్ యాంటీబాడీలున్న వ్యక్తులు కూడా వైరస్ బారినపడతారని పేర్కొన్నారు.