భారత్లో వ్యాప్తిలో ఉన్న వేరియంట్పై తమ టీకా సమర్ధవంతంగా పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వానికి ఫైజర్ సంస్థ తెలియజేసినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, ఈ టీకా చిన్నారులు సహా ప్రతి ఒక్కరికీ అనుకూలమైందని, 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య కోల్డ్ స్టోరేజ్లో నెల రోజుల పాటు నిల్వచేయవచ్చని కూడా చెప్పినట్టు పేర్కొన్నాయి. టీకా అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న ఫైజర్.. జులై-అక్టోబరు మధ్య ఐదు కోట్ల డోస్లు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే, దుష్ప్రభావంలకు సంబంధించి నష్టపరిహారం వంటి అంశాలలో మినహాయింపులు కోరుతోంది. గత కొద్ది వారాలుగా కేంద్ర అధికారులు, ఫైజర్ మధ్య పలు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఫైజర్ సీఈఓ అల్బెర్ట్ బౌర్లా సైతం పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కొవాగ్జిన్, రష్యా టీకా స్పుత్నిక్-వి టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఫైజర్ టీకాను అమెరికా, ఐరోపా సమాఖ్య సహా పలు దేశాల్లో వినియోగిస్తున్నారు.
‘‘అత్యవసర వినియోగం అనుమతులను సులభతరం చేయడానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం సహా 44 అధికారాలపై ఆధారపడి ఉంది’’ అని ఫైజర్ తెలిపింది. ‘‘భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయాలని భావించడంలేదని, సాధారణంగా స్పందించామని’’ ప్రభుత్వానికి ఫైజర్ తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్ డేటా, టీకా సమర్ధత, వివిధ దేశాల ఆమోదం సహా కీలక సమాచారాన్ని కేంద్రానికి సమర్పించింది. ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదాన్ని వేగవంతం చేయడానికి ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం చేసుకోవడమే.
గతవారం పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కోసం ఫైజర్, మోడెర్నాలను నేరుగా సంప్రదించగా.. అవి తిరస్కరించాయి.
కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందాలు చేసుకుంటామని స్పష్టం చేశాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వ్యక్తులకు టీకా వేయడానికి కేంద్రం అనుమతించినా.. ఓ నాలుగైదు తప్పా మిగతా రాష్ట్రాలు ఇప్పట్లో వేయలేమని స్పష్టం చేశాయి.
‘‘అత్యవసర వినియోగం అనుమతులను సులభతరం చేయడానికి డబ్ల్యూహెచ్ఓ ఆమోదం సహా 44 అధికారాలపై ఆధారపడి ఉంది’’ అని ఫైజర్ తెలిపింది. ‘‘భారత్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయాలని భావించడంలేదని, సాధారణంగా స్పందించామని’’ ప్రభుత్వానికి ఫైజర్ తెలిపింది.
క్లినికల్ ట్రయల్స్ డేటా, టీకా సమర్ధత, వివిధ దేశాల ఆమోదం సహా కీలక సమాచారాన్ని కేంద్రానికి సమర్పించింది. ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదాన్ని వేగవంతం చేయడానికి ప్రధాన సమస్య కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఒప్పందం చేసుకోవడమే.
గతవారం పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కోసం ఫైజర్, మోడెర్నాలను నేరుగా సంప్రదించగా.. అవి తిరస్కరించాయి.
కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందాలు చేసుకుంటామని స్పష్టం చేశాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేశారు. దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వ్యక్తులకు టీకా వేయడానికి కేంద్రం అనుమతించినా.. ఓ నాలుగైదు తప్పా మిగతా రాష్ట్రాలు ఇప్పట్లో వేయలేమని స్పష్టం చేశాయి.