యాప్నగరం

కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. మార్కెట్లో దొరుకుతుందా? ఎంతకు కొనొచ్చు?

Serum Institute of India: భారతీయులు ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వ్యాక్సిన్ సరఫరా చేశారు. ప్రభుత్వానికి రూ.200లకు డోసు చొప్పున ఇచ్చారు. మరి ప్రైవేట్ మార్కెట్లో దొరుకుతుందా? ఎంత ధరకు కొనవచ్చు?

Samayam Telugu 13 Jan 2021, 8:30 am
దేశ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వ్యాక్సిన్ డోసులను దేశంలోని నిల్వ కేంద్రాలకు మంగళవారం (జనవరి 12) తరలించారు. తమ సంస్థ నుంచి వ్యాక్సిన్ల రవాణా చరిత్రాత్మక ఘట్టమని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో అదర్‌ పూనావాలా అన్నారు. దేశ పౌరులందరికీ వ్యాక్సిన్‌ అందించడమే తమ ముందున్న ఛాలెంజ్‌ అని చెప్పారు.
Samayam Telugu కరోనా వ్యాక్సిన్
Corona Vaccine Rate in India


కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న టీకా సిద్ధమైంది. తొలి దశలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందజేస్తారు. మరి టీకా కావాలనుకునే వారికి బహిరంగ మార్కెట్లో దొరుకుతుందా? మార్కెట్లో రేట్ ఎంత ఉంది? కీలక వివరాలు..

కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు లాభాపేక్ష లేకుండా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు అదర్ పూనావాలా చెప్పారు. ఒక్కో డోసును కేవలం రూ.200లకే అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని కూడా తొలి దశలో కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. దేశంలోని సామాన్యులు, పేదలు, ఆరోగ్య కార్యకర్తల కోసం తక్కువ ధరకే టీకా సమకూరుస్తున్నట్టు పూనావాలా పేర్కొన్నారు. తొలి దశలో 10 కోట్ల డోసులను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సరఫరా చేసే డోసులకు రూ.200ల కంటే ఎక్కువ ఛార్జీ చేయనున్నట్లు తెలిపారు.

ఇక మార్కెట్‌లో ప్రైవేట్‌గా ఒక్కో వ్యాక్సిన్ డోసును 1000 రూపాయలకు విక్రయిస్తామని అదర్ పూనావాలా తెలిపారు. అవసరం ఉన్నవారు ఆ ధర చెల్లించి కొనుగోలు చేయవచ్చన్నమాట. కొవిషీల్డ్‌ టీకా కోసం దేశీయంగా, అంతర్జాతీయంగా చాలా డిమాండ్ నెలకొందని తెలిపారు. కరోనా టీకా కోసం అనేక దేశాలు పీఎంవోను సంప్రదిస్తున్నాయని పూనావాలా చెప్పారు. ఆఫ్రికా, దక్షిణ అమెరికాకు టీకాను పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఇండియా వ్యాక్సిన్‌కు ఫుల్ డిమాండ్.. అంచనాలకు మించి!
‘2021 చివరి నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్ అందించాలి. ఇదొక పెద్ద సవాలే. ఏం జరుగుతుందో చూడాలి’ అని అదర్ పూనావాలా అన్నారు.

నెలకు 70 నుంచి 80 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తామని అదర్ పూనావాలా చెప్పారు. భారత్‌, ఇతర దేశాలకు వ్యాక్సిన్ అందించే అంశంపై ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కేంద్రం సాయంతో లాజిస్టిక్స్‌ ప్రణాళికలు చేశామని, ట్రక్కులు, వ్యాన్లు, కోల్డ్‌ స్టోరేజీల కోసం పలు ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు.


Also Read:

ఆ దేశంలో తొలి కరోనా కేసు.. భయపడాల్సిన పని లేదట!

అమెరికా: ఒక్క రోజే 2.9లక్షల కేసులు.. శ్మశానాల్లో చోటులేని దుస్థితి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.