యాప్నగరం

భజ్జీ ఓటు ఎవరికేసాడో..?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

TNN 4 Feb 2017, 6:40 pm
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తల్లి అవతార్ కౌర్‌తో కలసి జలంధర్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 23లో ఓటు వేసాడు. అయితే భజ్జీ ఏ పార్టీకి ఓటేసాడన్నదే ఆసక్తికరం. ఎన్నికలపై హర్భజన్‌ స్పందిస్తూ ఎన్నికల్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీచేయడం వల్ల ఓట్లు చీలిపోయాయని చెప్పాడు. ఎవరూ గెలిచిన తమ సొంత పార్టీని పెంచి పోషించడం మాని పంజాబ్ అభివృద్ధికి తోడ్పడాలని సూచించాడు.
Samayam Telugu cricketer harbhajan singh cast his vote in jalandhar
భజ్జీ ఓటు ఎవరికేసాడో..?


పంజాబ్‌ యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారని, రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రావాలని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా హర్భజన్‌తో కొంత మంది అభిమానులు, భద్రతా సిబ్బంది సెల్ఫీలు దిగారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 117 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఈ పోలింగ్‌కు ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.