భారత క్రికెటర్ రవీంద్ర జడేజాకు చెందిన రెస్టారెంట్పై రెయిడ్ జరిగింది. గుజరాత్లోని రాజ్కోట్ నగరం కలావడ్ రోడ్లో ఉన్న ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’ రెస్టారెంట్పై స్థానికి అధికారులు దాడులు జరిపారు. రెస్టారెంట్లో కల్తీ ఆహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై రాజ్కోట్ మున్సిపల్ కార్పోరేషన్కు చెందిన ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జడేజా సోదరి నయనాబా అనిరుద్ధ్సింగ్ జడేజా ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’ రాజ్కోట్ నగరంలోనే చాలా ఫేమస్. దీనికి వినియోగదారుల తాకిడి కూడా ఎక్కవగా ఉంటుంది. అయితే రెస్టారెంట్లో పెడుతున్న ఆహారంలో కల్తీ జరుగుతోందని ఫుడ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం రాత్రి జడేజా రెస్టారెంట్పై అధికారులు దాడులు చేశారు. వండిన ఆహార పదార్థాలు (రైస్, గ్రేవీ, దాల్ ఫ్రై వంటివి), బేకరీ ప్రొడక్ట్స్ను చాలా కాలంపాటు డీప్ ప్రీజర్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఆహార పదార్థాల తయారీలో అజినోమోటో, కృత్రిమ రంగులు కూడా వాడుతున్నట్లు నిర్ధారించారు.
గడువు తేదీ అయిపోయిన ఆహార పదార్థాలు కూడా సోదాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 17 కేజీల కూరగాయలు, 7 కేజీల పాస్తా, మ్యాక్రోనీ, మంచూరియన్తో పాటు 14 కేజీల బ్యాకరీ ఐటమ్స్, 4 కేజీల గ్రేవీ, 500 గ్రాముల అజినోమోటో, 1.5 కేజీల కృత్రిమ రంగులను కార్పోరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెస్టారెంట్ యజమానిగా వ్యవహరిస్తున్న జడేజా సోదరికి నోటీసులు జారీ చేశారు.
జడేజా సోదరి నయనాబా అనిరుద్ధ్సింగ్ జడేజా ఆధ్వర్యంలో నడుస్తున్న ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’ రాజ్కోట్ నగరంలోనే చాలా ఫేమస్. దీనికి వినియోగదారుల తాకిడి కూడా ఎక్కవగా ఉంటుంది. అయితే రెస్టారెంట్లో పెడుతున్న ఆహారంలో కల్తీ జరుగుతోందని ఫుడ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదులు అందాయి. దీంతో శుక్రవారం రాత్రి జడేజా రెస్టారెంట్పై అధికారులు దాడులు చేశారు. వండిన ఆహార పదార్థాలు (రైస్, గ్రేవీ, దాల్ ఫ్రై వంటివి), బేకరీ ప్రొడక్ట్స్ను చాలా కాలంపాటు డీప్ ప్రీజర్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఆహార పదార్థాల తయారీలో అజినోమోటో, కృత్రిమ రంగులు కూడా వాడుతున్నట్లు నిర్ధారించారు.
గడువు తేదీ అయిపోయిన ఆహార పదార్థాలు కూడా సోదాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 17 కేజీల కూరగాయలు, 7 కేజీల పాస్తా, మ్యాక్రోనీ, మంచూరియన్తో పాటు 14 కేజీల బ్యాకరీ ఐటమ్స్, 4 కేజీల గ్రేవీ, 500 గ్రాముల అజినోమోటో, 1.5 కేజీల కృత్రిమ రంగులను కార్పోరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెస్టారెంట్ యజమానిగా వ్యవహరిస్తున్న జడేజా సోదరికి నోటీసులు జారీ చేశారు.