యాప్నగరం

దాడికి యత్నించిన తీవ్రవాదులు.. తిప్పికొట్టిన సైన్యం

జమ్మూ‌లోని సుంజ్వాన్ సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడి ఘటన మరువకముందే ముష్కరులు తాజాగా మరో దాడికి పాల్పడ్డారు.

TNN 12 Feb 2018, 12:11 pm
జమ్మూ‌లోని సుంజ్వాన్ సైనిక స్థావరంపై జైషే మహ్మద్ ఉగ్రవాదుల దాడి ఘటన మరువకముందే ముష్కరులు తాజాగా మరో దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్ సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు లోనికి చొరబడటానికి ప్రయత్నించారు. సోమవారం తెల్లవారుజామున కరణ్‌నగర్ క్యాంప్‌‌లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులపై కాపాలాగా ఉన్న సైనికులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఆ ఇద్దరూ సమీపంలోని ఓ భవనంలోకి చొరబడ్డారని, ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రవిదీప్ షాహి తెలిపారు. ఉగ్రవాదుల చేతుల్లో ఏకే 47 తుపాకులు ఉన్నట్టు సమాచారం. ఈ కాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డాడు.
Samayam Telugu crpf guard foils attack at camp in srinagars karan nagar encounter on
దాడికి యత్నించిన తీవ్రవాదులు.. తిప్పికొట్టిన సైన్యం


పోలీస్ కస్టడీలో ఉన్న ఉగ్రవాది నవీద్ అలియాస్ అబు హుంజుల్ గతవారం అనారోగ్యం పేరుతో శ్రీనగర్‌లోని శ్రీమహారాజా హరిసింగ్ హాస్పిటల్‌లో చేరి, అక్కడ నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దాడిచేసిన సీఆర్పీఎఫ్ 23 వ బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఇక్కడకు కూతవేటు దూరంలోనే ఉంది. రెండు రోజుల కిందట సుంజ్వాన్ స్థావరంపై దాడి జరగడంతో, సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై కూడా దాడికి పాల్పడే అవకాశం ఉందని నిఘా విభాగం హెచ్చరించింది. సుంజ్వాన్ ఉగ్రదాడిలో ఇద్దరు అధికార్లతో సహాఐదురుగు సైనికులు, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రవాదులను సైన్యం హతమార్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.