యాప్నగరం

CRPF జవాన్ల వ్యాన్ బోల్తా.. పశువులను తప్పించబోయి ప్రమాదంలో పడ్డ సైనికులు

Jawans Van Overturn: CRPF జవాన్లతో వెళ్తున్న ఓ వ్యాన్ ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన పశువుల గుంపును తప్పించబోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 30 Oct 2020, 8:52 pm
సీఆర్‌పీఎఫ్ జవాన్లతో వెళుతోన్న ఓ ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో శుక్రవారం (అక్టోబర్ 30) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లతో కూడిన ట్రక్కు రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా దారికి అడ్డంగా పశువులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వ్యాన్ అదుపు తప్పి ప్రమాదం సంభవించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
CRPF Jawans, Jammu Kashmir Police (Representational Image for this news)


ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో సీఆర్పీఎఫ్‌ 154వ బెటాలియన్‌కు చెందిన 25 మంది జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా మదుబన్‌ నుంచి నిమియా ఘాట్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ పశువుల గుంపును తప్పించేందుకు ప్రయత్నించడంతో ఈ విషాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం కొంత జవాన్లను ఆర్మీ హెలికాప్టర్ ద్వారా తరలించడానికి నిర్ణయించారు.

Also Read: పుల్వామా ఘటనపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.