యాప్నగరం

శ్రీనగర్లో ఇంకా కర్ఫ్యూ

కాశ్మీర్లో పరిస్థితులు చల్లబడడంతో రెండు రోజుల కిందటే కర్ఫ్యూను ఎత్తివేశారు.

TNN 29 Jul 2016, 11:12 am
కాశ్మీర్లో పరిస్థితులు చల్లబడడంతో రెండు రోజుల కిందటే కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే శ్రీనగర్లోని కొన్ని ప్రాంతాల్లో, అనంత్ నాగ్ లో మాత్రం ఇంకా కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినట్టు చెప్పినప్పటికీ పోలీసుల పహారా ఇంకా కొనసాగుతోంది. వేర్పాటువాద నాయకులు ఈ నెల 31 వరకు ఆందోళనలు చేస్తామని ప్రకటించడంతో పోలీసులు ఇంకా రోడ్లపైనే పహారా కాస్తున్నారు. ఎలాంటి హింసాత్మక సంఘటనలకు దిగకుండా, శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. కాగా కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ... అనంతనాగ్ లో ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అంది భద్రతా దళాలు అక్కడికి వెళ్లాయని తెలిపారు. అయితే ఆ ఇంట్లో ఉగ్రవాది బుర్హాన్ కూడా ఉన్నాడని తెలియదని అన్నారు. ముందే తెలిస్తే అతడు లొంగిపోయేందుకు అవకాశం ఇచ్చి ఉండేవాళ్లమని చెప్పారు. ఇతర ఉగ్రవాదులతో కలిపి బుర్హాన్ ను కూడా భద్రతాదళాలు మట్టుబెట్టాయి. అనంతరం ఆయన మద్దతుదారులు, వేర్పాటు వాదులు కాశ్మీర్లో అల్లర్లకు దిగారు.
Samayam Telugu curfew continues in parts of srinagar and ananthnag
శ్రీనగర్లో ఇంకా కర్ఫ్యూ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.