యాపిల్ ఐ ఫోన్లు( 7s & 7+s) సీజ్, వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ ఎయిర్ పోర్టులో అక్రమంగా దిగుమతి చేస్తున్న యాఫిల్ ఐ ఫోన్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
TNN 25 Sep 2016, 8:09 pm
ఢిల్లీ: యాపిల్ ఐ ఫోన్ 7 మరియు 7+ లేవని ఇక బాధపడాల్సిన అవసరం లేదు.. ఢిల్లీలోని బ్లాక్ మార్కెట్ లో యధేచ్ఛగా దొరికిపోతున్నాయ్. యాపిల్ ఐ ఫోన్ 7 & 7+ మొబైల్స్ ఇంకా భారత్లో లాంచ్ చేయని విషయం తెలిసిందే. అయితే దీన్ని హాంగ్కాంగ్ నుంచి భారత్కు యధేచ్చగా దిగుమతి అవుతున్నాయి. ఈ విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో ఆదివారం ఓ వ్యక్తి ఐ ఫోన్లు దిగుమతి చేసుకుంటూ కష్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 75 ఐ ఫోన్లు (7 & 7+) స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు.వీటి విలువ 46.39 లక్షలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల విచారణలో పట్టుబడ్డ వ్యక్తి అనేక విషయాలను వెల్లడించాడు. తాను హాంగ్ కాంగ్ నుంచి దిగుమతి చేసుకున్నానని.. ప్రస్తుతం ఈ ఐ ఫోన్లు ఢిల్లీలోని పాలికా, గఫ్సార్, లజపతి నగర్ బజార్లలో అమ్ముతున్నట్లు తెలిపాడు.వారం రోజుల్లో మొత్తం 100 ఫోన్లు దిగుమతి చేసుకున్నట్లు అధికారులకు తెలిపాడు ఇదిలా ఉండగా బ్లాక్ మార్కెట్ లో ఈ మొబైైల్స్ కొన్నవారు వాటిని పోలీసులకు అప్పగించాలని.. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా ఈ ఐ ఫోన్లను కొలుగోలు చేస్తున్నా.. అమ్ముతున్నా తమకు సమచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Customs officials seized 75 iPhone 7s and 7+s :
Customs officials seized 75 iPhone 7s and 7+s at Indira Gandhi International Airport on Saturday. And arrested one person for smuggling in the phones worth Rs 46.39 lakh from Hong Kong where the devices were launched recently.
Customs officials seized 75 iPhone 7s and 7+s :
Customs officials seized 75 iPhone 7s and 7+s at Indira Gandhi International Airport on Saturday. And arrested one person for smuggling in the phones worth Rs 46.39 lakh from Hong Kong where the devices were launched recently.