గత రెండు మాసాలుగా భరించలేని ఎండలు, ఉక్కబోతలతో అల్లాడతున్న జనాలకు కాస్త ఊరటి కలిగించే వార్త. ప్రచండ భానుడి ప్రభావంతో అల్లాడుతున్న దక్షిణాది రాష్ట్రాల వారికి ఇది మరింత సంతోషం కలిగించే సమాచారం. పశ్చిమ మధ్య, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయంలోగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వాతావరణం చల్లబడిందని, దక్షిణాది రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం నుంచి కొంత ఊరట లభించనుందని అధికారులు తెలిపారు.
నైరుతి రుతు పవనాలు ఈ నెలాఖరులోగా మాల్దీవులు, దక్షిణ కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి బలంగా ఉన్నందున నేడు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని, ఆపై రుతుపవనాల ప్రభావంతోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
నైరుతి రుతు పవనాలు ఈ నెలాఖరులోగా మాల్దీవులు, దక్షిణ కేరళను తాకే అవకాశం ఉందని అంచనా వేశారు. దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి బలంగా ఉన్నందున నేడు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరో మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం ఉంటుందని, ఆపై రుతుపవనాల ప్రభావంతోనూ వర్షాలు కురుస్తాయని తెలిపారు.