యాప్నగరం

వెన్నులో వణుకు పుట్టిస్తున్న చలి.. గడ్డకట్టిన దాల్ సరస్సు

నిన్నరాత్రి 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దీంతో చలి విపరీతంగా పెరిగింది. పైపుల్లో నీరు కూడా గడ్డకట్టుకుపోయింది.

Samayam Telugu 14 Jan 2021, 3:00 pm
జమ్మూకాశ్మీర్‌లో చలి పంజా విసురుతోంది. భారీగా తగ్గుతున్న అక్కడ ఉష్ణోగ్రతలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. చలి దెబ్బకు ప్రజలు ఎవరూ బయటకు రాలేని పరిస్థితి. బుధవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. తీవ్రమైన చలికి కాశ్మీర్‌లోని ప్రముఖ దాల్ సరస్సు మొత్తం గడ్డకట్టుకుపోయింది. సరస్సులో నీరంతా ఐస్‌లా మారిపోయింది. ఉష్ణోగ్రతలు మైనస్ 8.4 డిగ్రీలకు చేరగా.. 1991 తర్వాత కాశ్మీర్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే.
Samayam Telugu శ్రీనగర్‌లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు


జనవరి, 1991లో మైనస్ 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరశాఖ అధికారులు తెలుపారు. 1893లో శ్రీనగర్‌లో కనిష్ఠ ఉష్ణోగత్ర మైనస్ 14.4 డిగ్రీలని చెప్పారు. ఇదిలా ఉండగా.. తీవ్రమైన చలికి లోయ ప్రాంతం వణికిపోతోంది. దక్షిణ కాశ్మీర్‌లోని వార్షిక అమర్‌నాథ్ యాత్రకు బేస్ క్యాంప్‌గా పని చేస్తున్న పహల్గామ్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 11.1 డిగ్రీలకు చేరింది. అంతకు ముందు రాత్రి మైనస్ 11.7 డిగ్రీలను తాకింది. గుల్మార్గ్ పర్యాటక ప్రాంతంలో మైనస్ 7 డిగ్రీల వద్ద స్థిరపడింది. ఉత్తర కాశ్మీర్‌లో కుప్వారాలో మైనస్ 6.7, కోకర్నాగ్‌లో కనిష్ఠ స్థాయి మైనస్ 10.3 డిగ్రీల సెల్సియస్.

Read More: కరోనా వ్యాక్సిన్ వేసుకొని మద్యం సేవించకండి... ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

తీవ్రమైన చలితో అక్కడ నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లకు సరఫరా చేయాల్సిన నీరంతా పైపుల్లో గడ్డ కట్టుకుపోయింది దీంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అటు కాశ్మీర్‌తో పాటు లోయలో దట్టమైన మంచు కప్పివేడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.