యాప్నగరం

ఫోన్ నెంబర్ ఇవ్వలేదని.. బాలికకు నిప్పు!

దేశంలో మహిళలు.. చిన్నారులపై దౌర్జన్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు చట్టాలను ఎంత కఠినతరం చేసినా అమాయక బాలికలపై మృగాళ్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

Samayam Telugu 9 May 2018, 8:44 pm
దేశంలో మహిళలు.. చిన్నారులపై దౌర్జన్యాలు ఆగడం లేదు. ప్రభుత్వాలు చట్టాలను ఎంత కఠినతరం చేసినా అమాయక బాలికలపై మృగాళ్ల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఆగడాలకు ఉత్తరప్రదేశ్‌ కేంద్రంగా మారింది. తాజాగా.. ఫోన్ నెంబర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో ఓ దళిత మైనర్ బాలికకు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు.
Samayam Telugu aaaa


ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అజంగడ్ జిల్లా ఫరిహా గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికే చెందిన మహమ్మద్ షాయి అనే వ్యక్తి బాలిక (16) ఇంటికి వెళ్లి ఆమె ఫోన్ నెంబరు అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన షాయి.. ఆమెను తీవ్రంగా కొట్టాడు. కదల్లేని పరిస్థితిలో ఉన్న ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు.

మంటల బాధ తాళలేక బాలిక గట్టిగా కేకలు పెట్టింది. దీంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరి ఆమెను రక్షించారు. పారిపోయేందుకు ప్రయత్నించిన షాయికి చితకబాది పోలీసులకు అప్పగించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రి నుంచి వారణాసిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలిక శరీరం 80 శాతం కాలిపోయిందని, నిందితుడిపై పొస్కో చట్టంతో పాటు ఎస్పీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.