ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ఓ దళిత సంఘం నుంచి భారీ నిరసన సెగ తగిలింది. గుజరాత్కి చెందిన అంబేద్కర్ వేచన్ ప్రతిబంధ్ సమితి దళిత సంఘం సీఎం యోగి ఆదిత్యానాథ్కి 3 అడుగుల పొడవుతో 125 కేజీల బరువున్న సబ్బును బహుమతిగా పంపించేందుకు సిద్ధమైంది. గత నెల చివరి వారంలో సీఎం ఆదిత్యనాథ్ ఖుషీనగర్ దళితవాడలో పర్యటనకి వస్తున్నారంటూ అక్కడి స్థానిక అధికారులు ఆ బస్తీ వాసులకి సబ్బులు, షాంపూలు పంపిణీ చేసి శుభ్రంగా స్నానం చేయమని ఆదేశాలు జారీ చేయడం అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనియాంశమైంది.
సరిగ్గా ఇదే ఘటనపై నిరసన వ్యక్తంచేస్తూ.. గుజరాత్కి చెందిన దళిత సంఘం తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఇలా 125 కేజీల బరువున్న సబ్బుని బహుమతిగా పంపించడానికి ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా తాము పంపిన సబ్బుతోనే స్నానం చేసిన తర్వాత సీఎం గారు దళితులను కలవొచ్చని పేర్కొన్నారు ఆ సంఘం ప్రతినిధులు.
సీఎం పర్యటనకి ముందే దళిత వాడలో సబ్బులు, షాంపూలు పంపిణీ చేశారంటే ఆయనకి ఎంత కుల వివక్ష వుందో చెప్పడానికి ఈ ఒక్క ఘటనే చక్కటి ఉదాహరణ అని అన్నారు నవసర్జన్ ట్రస్ట్ అనే దళిత స్వచ్ఛంద సంస్థని లీడ్ చేస్తున్న మార్టిన్ మాక్వాన్. ఈ ఏడాదే డా. బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని జరుపుకున్నాం కనుక యోగి ఆదిత్యనాథ్కి 125 కిలోల బరువైన సబ్బునే పంపించాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో ఈ సబ్బుని 664 కేజీల బరువుతో 16 అడుగుల డిజైన్తో వుండేలా ప్లాన్ చేశాం. కానీ చివరి నిమిషంలో తమ ఆలోచన మార్చుకుని ఇలా 125 కిలోల బరువైన సబ్బుని రూపొందించాం అని తెలిపారు మార్టిన్. ఈ సబ్బుపై బుద్ధ విగ్రహాన్ని సైతం ముద్రించడం వీరి నిరసనకి మరో ప్రత్యేకత.
సరిగ్గా ఇదే ఘటనపై నిరసన వ్యక్తంచేస్తూ.. గుజరాత్కి చెందిన దళిత సంఘం తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఇలా 125 కేజీల బరువున్న సబ్బుని బహుమతిగా పంపించడానికి ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా తాము పంపిన సబ్బుతోనే స్నానం చేసిన తర్వాత సీఎం గారు దళితులను కలవొచ్చని పేర్కొన్నారు ఆ సంఘం ప్రతినిధులు.
సీఎం పర్యటనకి ముందే దళిత వాడలో సబ్బులు, షాంపూలు పంపిణీ చేశారంటే ఆయనకి ఎంత కుల వివక్ష వుందో చెప్పడానికి ఈ ఒక్క ఘటనే చక్కటి ఉదాహరణ అని అన్నారు నవసర్జన్ ట్రస్ట్ అనే దళిత స్వచ్ఛంద సంస్థని లీడ్ చేస్తున్న మార్టిన్ మాక్వాన్. ఈ ఏడాదే డా. బీఆర్ అంబేద్కర్ 125వ జయంతిని జరుపుకున్నాం కనుక యోగి ఆదిత్యనాథ్కి 125 కిలోల బరువైన సబ్బునే పంపించాలని నిర్ణయించుకున్నాం. మొదట్లో ఈ సబ్బుని 664 కేజీల బరువుతో 16 అడుగుల డిజైన్తో వుండేలా ప్లాన్ చేశాం. కానీ చివరి నిమిషంలో తమ ఆలోచన మార్చుకుని ఇలా 125 కిలోల బరువైన సబ్బుని రూపొందించాం అని తెలిపారు మార్టిన్. ఈ సబ్బుపై బుద్ధ విగ్రహాన్ని సైతం ముద్రించడం వీరి నిరసనకి మరో ప్రత్యేకత.