ఎంపీల కోసం పార్లమెంటులో హిందీ చిత్రం ‘దంగల్’ను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. గురువారం సాయంత్రం పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఈ చిత్ర ప్రదర్శన జరుగుతుందని ఎంపీలందరికీ సమాచారం అందింది.
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవతో ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఉభయ సభల సమావేశాల అనంతరం గురువారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ప్రదర్శన ఉంటుందని లోక్ సభ ప్రధాన కార్యదర్శి అనూప్ మిశ్రా తెలిపారు.
బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మల్లయోధుడు మహావీర్ సింగ్ పోగట్ ఆయన కూతుళ్లు గీత పోగట్, బబితా కుమారిల జీవితం ఆధారంగా రూపొందించారు.
ఎంపీలంతా సినిమాను తిలకించేందుకు తప్పనిసరిగా రావాలంటూ స్పీకర్ కార్యాలయం సూచించింది.
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవతో ఈ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఉభయ సభల సమావేశాల అనంతరం గురువారం సాయంత్రం 6.30 గంటలకు చిత్ర ప్రదర్శన ఉంటుందని లోక్ సభ ప్రధాన కార్యదర్శి అనూప్ మిశ్రా తెలిపారు.
బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మల్లయోధుడు మహావీర్ సింగ్ పోగట్ ఆయన కూతుళ్లు గీత పోగట్, బబితా కుమారిల జీవితం ఆధారంగా రూపొందించారు.
ఎంపీలంతా సినిమాను తిలకించేందుకు తప్పనిసరిగా రావాలంటూ స్పీకర్ కార్యాలయం సూచించింది.