యాప్నగరం

మాయావతిని తిట్టిన వారికి అఖిలేష్ ఆఫర్

బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని దూషించి బీజేపీ నుంచి సస్పెండ్‌కు గురైన దయాశంకర్‌కు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆఫరిచ్చారు.

TNN 28 Oct 2016, 2:36 pm
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని దూషించి బీజేపీ నుంచి సస్పెండ్‌కు గురైన దయాశంకర్‌కు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆఫరిచ్చారు. దయాశంకర్ ఆయన సతీమణీ ఇద్దరూ సమాజ్ వాదీ పార్టీలో చేరాలని అఖిలేష్ స్వయంగా వారిని కోరారు.
Samayam Telugu daya shanker and his wife welcomed into sp by akhilesh
మాయావతిని తిట్టిన వారికి అఖిలేష్ ఆఫర్


ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న దయాశంకర్ మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అధిష్టానం....అతన్ని పార్టీ నుంచి బహిష్కరించింది. బీఎస్పీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించడంతో అఖిలేష్ ప్రభుత్వం దయాశంకర్ ను అరెస్టు చేసి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసింది. దయాశంకర్ ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారు.

దయాశంకర్ ను పార్టీ నుంచి తొలగించిన బీజేపీ..ఆయన సతీమణి స్వాతి సింగ్‌ని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలిగా నియమించింది.

గురువారం ఓ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి దయాశంకర్, స్వాతీలు హాజరయ్యారు. వేదికపై ప్రసంగిస్తున్న అఖిలేష్ యాదవ్...సభికుల వరుసలో కూర్చున్న దయాశంకర్ దంపతులను గమనించారు.

‘బెహన్‌జీ ఒత్తిడి మేరకు త్వరితగతిన పోలీసులకు ఆదేశాలు జారీ చేసి అరెస్టు చేయించాల్సి వచ్చింది’ అని దయాశంకర్ ను ఉద్దేశించిన అఖిలేష్ అన్నారు.

‘అభివృద్ధి సమాజ్ వాదీ పార్టీతోనే సాధ్యం. మీరు మాతో కలిసి రావాలి. పార్టీలో చేరాలి. బీజేపీ మీకు ఏలాంటి సాయం చేయదు’ అని వేదిక మీద నుంచే అఖిలేష్ ఆఫరిచ్చారు.
దయాశంకర్ ను చూస్తూ అఖిలేష్ ఈ ఆఫర్ ఇవ్వగానే..సడెన్ సర్‌ప్రైజ్‌కు దయాశంకర్, ఆయన సతీమణి స్వాతి సహా సమావేశంలో పాల్గొన్న ఇతర నేతలు అవాక్కయ్యారు.

అఖిలేష్ ఆఫర్ పై దయాశంకర్ ఏలాంటి కామెంట్లు చేయలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.