యాప్నగరం

ఒకరి నిర్లక్ష్యానికి.. ముగ్గురి ప్రాణాలు బలి!

ఒకరు చేసే తప్పు.. ముగ్గురు ప్రాణాలను బలి తీస్తోంది. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. ఏమిటా నిర్లక్ష్యం? దానికి చెల్లిస్తున్న మూల్యమెంతా?

TNN 12 Jan 2017, 3:39 pm
కరు చేసే తప్పు.. ముగ్గురు ప్రాణాలను బలి తీస్తోంది. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. ఏమిటా నిర్లక్ష్యం? దానికి చెల్లిస్తున్న మూల్యమెంతా? అని ప్రశ్నించుకుంటే... దానికి సమాధానం ఇక్కడే దొరుకుతుంది. దేశంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణం. ఫలితంగా.. ఏటా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు వల్లనే చోటు చేసుకుంటున్నాయి. 2015లో దాదాపు 1.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విచారకరమైన విషయం ఏమిటంటే... మరణించిన 1.5 లక్షల మందిలో 1.1 లక్షల మంది ఏ తప్పిదం చేయకుండానే... మరొకరి నిర్లక్ష్యానికి బలయ్యారు. దేశంలో ఒకరి తప్పిదానికి ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు.
Samayam Telugu death ratio in accidents one rule violator three innocents
ఒకరి నిర్లక్ష్యానికి.. ముగ్గురి ప్రాణాలు బలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.